దారుణం: ఒకోచోట 18 ఏనుగులు మృత్యువాత!
ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాత పడిన దారుణ ఘటన అస్సాంలోని నాగావన్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి అటవీ అధికారుల సమాచారం ప్రకారం, కత్తైటోలి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో......
దర్యాప్తునకు అస్సాం ముఖ్యమంత్రి ఆదేశం
గుహవాటి: ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాత పడిన దారుణ ఘటన అస్సాంలోని నాగావన్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి అటవీ అధికారుల సమాచారం ప్రకారం, కత్తైటోలి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఏనుగుల సమూహాలు విగత జీవులుగా పడివుండడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. కొండ ప్రాంతంలో ఒకచోట 14 ఏనుగులు, మరోచోట నాలుగు ఏనుగులు మృత్యువాతపడ్డట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటు వల్ల ప్రాణలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టంలోనే పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. అయితే, అక్కడి ఏనుగుల నిపుణులు మాత్రం విషప్రయోగం వల్లే 18 ఏనుగులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏదేమైనా, పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ స్థాయిలో ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాతపడడం దేశంలో ఇదే తొలిసారి అని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. ఏనుగుల మృతికి గల కారణాలపై పూర్తి దర్యాప్తు జరపాలని అటవీశాఖ మంత్రి పరిమల్ శుక్ల బైద్యకు సూచించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఘటనా ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని మంత్రి వెల్లడించారు.
మరోవైపు, దేశంలో ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, అస్సాం రెండో స్థానంలో ఉంది. 2017 లెక్కల ప్రకారం, అస్సాంలో దాదాపు 5700 ఏనుగులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఏనుగులను వేటాడడం, రైలు ప్రమాదాలు, విష ప్రయోగంతో పాటు విద్యుదాఘాతం వంటి కారణాల వల్ల ఏనుగుల ప్రాణాలు కోల్పోవడం గతకొన్నేళ్లుగా పెరిగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ 9’ పబ్పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్