ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి

తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్‌ రైస్‌లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు.

Published : 05 May 2024 08:29 IST

నామక్కల్‌: తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్‌ రైస్‌లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. తమిళనాడులోని నామక్కల్‌లో ఈ ఘటన జరిగింది. నామక్కల్‌ బస్టాండు ఎదురుగా జీవానందం (32) అనే యువకుడు రెస్టారెంటు నడుపుతున్నాడు. భగవతి (20) అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఈ రెస్టారెంటు నుంచి ఏప్రిల్‌ 30న ఏడు ప్యాకెట్ల చికెన్‌ రైస్‌ తీసుకువెళ్లింది. ఇంట్లో ఉన్న తల్లి నదియా (40), తాత షణ్ముగనాథన్‌ (67) ఆ అన్నం తిన్నారు. మిగతా కుటుంబసభ్యులు తినకముందే వారిద్దరూ అస్వస్థతతకు గురయ్యారు. వెంటనే నామక్కల్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్సపొందుతూ మే 2న షణ్ముగనాథన్‌, 3న నదియా మృతిచెందారు. పోలీసులు చికెన్‌ రైస్‌ నమూనాలు పరీక్షకు పంపగా, విషం ఉన్నట్లు తేలింది. భగవతితోపాటు హోటల్‌ యజమాని జీవానందంను వేర్వేరుగా విచారించారు. భగవతి తన నేరాన్ని అంగీకరించడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని