కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బొలెరో, టాటా ఏస్ వాహనాలు శుక్రవారం రాత్రి ఢీకొన్న సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. సవదట్టి పట్టణ శివార్లలో సవదట్టి-ధార్వాడ్‌

Published : 02 Oct 2020 22:38 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బొలెరో, టాటా ఏస్ వాహనాలు శుక్రవారం రాత్రి ఢీకొన్న సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. సవదట్టి పట్టణ శివార్లలో సవదట్టి-ధార్వాడ్‌ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది గాయపడ్డారని సమాచారం. ప్రమాదానికి గురైన వారు సవదట్టిలోని చుంచ్నూర్ గ్రామానికి చెందిన వారని తెలిసింది. పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని