అక్రమ మద్యం.. పట్టించిన గేదెలు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు రైతుల్ని వారు పెంచుతున్న గేదెలే పట్టించిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. గుజరాత్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా
అహ్మదాబాద్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు రైతుల్ని వారు పెంచుతున్న గేదెలే పట్టించిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండాలని పశువుల పాకలో గేదెలు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అయితే, ఇటీవల ఆ బాటిళ్లలో ఒకటి పగిలిపోవడంతో అందులో ఉండే మందు నీళ్లలో కలిసిపోయింది. అలా మందు కలిసిన నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం, వాటి నోటి నుంచి నురుగ రావడం మొదలైంది. ఇది గమనించిన నిందితుల్లో ఒకరు పశువైద్యుడిని పిలిపించాడు. ఏం జరిగిందా అని వైద్యుడు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వైద్యుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32వేలు విలువ చేసే 100 మందు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM