వడదెబ్బతో ఆరుగురి మృతి

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు.

Published : 08 May 2024 03:55 IST

న్యూస్‌టుడే బృందం: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దెబ్బట సంపత్‌ (50), నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జిడుగు సత్యం (45), సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన తొండల సత్యం (53), మెదక్‌ జిల్లా శివ్వంపేటకు చెందిన కాలకంటి లక్ష్మి (50), ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌కు చెందిన మస్కాపూర్‌ ఇస్తారి (38), రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికుడు బేతి కిష్టయ్య (70) వడదెబ్బ బారిన పడి మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని