‘జే బ్రాండ్‌’ మద్యం తాగి వృద్ధుడి మృతి

జే బ్రాండ్‌ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్‌ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 08 May 2024 07:59 IST

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: జే బ్రాండ్‌ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్‌ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని శెట్టిపల్లెకి చెందిన కొండయ్య(65) కొన్నేళ్ల కిందట భార్య మల్లేశ్వరి, కుమారుడితో కలిసి కడప నగరంలోని నాగరాజుపేటకు వలస వచ్చారు. కొండయ్య మద్యానికి బానిసై    3 నెలల కిందట ఇంటినుంచి వెళ్లిపోయి.. పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు.

సోమవారం రాత్రి మూలవంకకు వచ్చి ఓ దర్గా వద్ద పడుకున్నారు. అప్పటికే అతను మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం పరిశీలించగా.. మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి ‘జే బ్రాండ్‌’ మద్యం తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నకిలీ మద్యానికి బానిసై తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నారని మృతుని భార్య మల్లేశ్వరి విలపించారు. ఈ విషయమై గ్రామీణ సీఐ శంకర్‌నాయక్‌ను వివరణకోరగా.. దీనిపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు