Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

Updated : 22 Sep 2023 19:34 IST

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి చెందడం స్థానికులను కలచివేసింది. శ్రీవిద్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల తరగతి గదిలో నాపరాయి పడటంతో యూకేజీ చదువుతున్న కీర్తన(5) మృతి చెందింది. శుక్రవారం కీర్తన పుట్టినరోజు కావడంతో ఆనందంగా పాఠశాలకు వచ్చింది. తోటి చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందంగా గడిపి  తరగతి గదిలోనే సేదతీరింది. చిన్నారి పడుకొని ఉన్న సమయంలో నాపరాయి మీద పడటంతో తీవ్రగాయాలపాలైంది. రక్తమోడుతున్న కీర్తనను హుటాహుటిన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఆనందంగా పుట్టిన రోజు జరుపుకొంటున్న రోజే చిన్నారి మృతి చెందడటంతో పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. కీర్తన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని, నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని