Hanamkonda: హనుమకొండలో దారుణం.. అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది.

Updated : 12 Oct 2023 17:16 IST

భీమారం: హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కేయూ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, వరంగల్‌ జిల్లా కీర్తి నగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబ కలహాలతో గత మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, పెద్దపల్లి జిల్లా కోటపల్లి ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌.. తుపాకీని తీసుకుని గుండ్ల సింగారంలోని తన అత్తగారి ఇంటికి ఇవాళ వచ్చాడు. ఈ నేపథ్యంలో అత్త కమలమ్మ(53)కు ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ తన వద్ద ఉన్న తుపాకీతో కమలమ్మను కాల్చి చంపాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి కేయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకొని..దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు