కుక్కకు హీలియమ్ బెలూన్లు కట్టి.. గాల్లోకి..
తమదైన శైలిలో వీడియోలు చేసి వీక్షకులను ఆకట్టుకోవడానికి విభిన్నంగా ప్రయత్నిస్తుంటారు యూట్యూబర్స్. అయితే కొన్నిసార్లు అవి పేరు తెచ్చిపడితే.. ఒక్కోసారి వివాదాలకూ దారితీస్తాయి. తాజాగా దిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్కను గాలిలో ఎగిరించేందుకు దానికి హీలియమ్ బెలూన్స్ కట్టి, దాన్ని చీత్రికరించి యూట్యుబ్లో పెట్టి, కటకటాలపాలయ్యాడు.
ఓ యూట్యూబర్ నిర్వాకం
దిల్లీ: విభిన్న వీడియోలు తీసి వీక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు యూట్యూబర్స్. అయితే కొన్నిసార్లు అవి పేరు తెచ్చిపడితే.. ఒక్కోసారి వివాదాలకూ దారితీస్తాయి. తాజాగా దిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్కను గాలిలో ఎగిరించేందుకు దానికి హీలియమ్ బెలూన్స్ కట్టి, చీత్రికరించి యూట్యుబ్లో పెట్టి, కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. అతడి పేరు గౌరవ్. ‘గౌరవ్జోన్’ అనే యూట్యూబ్ ఛానెల్కు 40 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ్ తాజాగా పెంపుడు కుక్క డాలర్కు హీలియమ్ బెలూన్స్ను, కట్టి గాలిలో ఎగురవేశాడు. కుక్క శరీరం ముందు భాగం ఎగరడం మొదలయ్యాక, బెలూన్ల స్ర్టింగ్ను పైకి లాగి కుక్కను మరింత పైకి ఎత్తాడు. ఈ క్రమంలో డాలర్ రన్ అని చెప్పగా.. అది గాలిలోకి సైతం ఎగిరింది. ఇంకా పైకి ఎగరాలనే ఉద్దేశంతో మరిన్ని బెలూన్లను సైతం కట్టాడు. మరో దృశ్యంలో.. ఓజీపు మీదకు ఎక్కిన గౌరవ్ దానిమీద కూర్చొని గాలిలో బెలూన్లు కట్టిన తన కుక్కను ఎగురవేశాడు. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే ఆ వీడియోను తొలగించాడు.
వీక్షకుల ఆనందం కోసం ఇలా మూగజీవాలను ఇబ్బందులకు గురి చేసిన గౌరవ్పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దక్షిణ దిల్లీలోని మాల్వియా నగర్ పోలీసులు. ఇదిలా ఉండగా తాను చేసిన ఈ పనికి క్షమాపణలు కోరుతూ మరో వీడియోను విడుదల చేశాడు గౌరవ్. అందులో తన పాత వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ‘‘కుక్కను గాలిలో ఎగురవేసే ముందు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొనే వీడియో తీశాం. మేము తీసుకున్న జాగ్రత్తలను సైతం వీడియోలో పెడదామనుకున్నాం.. అప్పటికే వీడియో నిడివి ఎక్కువ కావడంతో దాన్ని అప్లోడ్ చేయలేదు. ఇదంతా నా తప్పే. జాగ్రత్తలు తీసుకున్నా, ప్రజలకు తప్పుడు సందేశమే వెళ్లింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. నా వీక్షకులకు, పెట్ లవర్స్కి క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఇలాంటి వీడియోలు ప్రయత్నించను. ఇలాంటివి చూసి ప్రభావితం కాకండి’’ అంటూ క్షమాపణలు కోరాడు గౌరవ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ఏనుగు దాడి
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్