Crime News: భద్రాద్రి జిల్లాలో సాయుధులైన ఐదుగురు మావోయిస్టుల అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 16 Feb 2024 23:22 IST

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పూసపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం వీరంతా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు సోదా చేశారు. ఆ సమయంలో సాయుధులైన కొందరు పారిపోతుండగా వారిలో ఐదుగురుని పట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో స్టేట్‌ కమిటీ సెక్రటరీ కురసం వంజయ్య అలియాస్‌ అశోక్‌, సభ్యులు సమ్మయ్య, ముత్తయ్య, సాహెబ్‌, సురేశ్‌ ఉన్నారు. నిందితుల నుంచి పిస్టల్‌, 5 జిలెటిన్‌ స్టిక్స్‌, 4 కిట్‌ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని  ఎస్పీ రోహిత్‌ రాజ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని