Crime News: భద్రాద్రి జిల్లాలో సాయుధులైన ఐదుగురు మావోయిస్టుల అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పూసపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం వీరంతా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు సోదా చేశారు. ఆ సమయంలో సాయుధులైన కొందరు పారిపోతుండగా వారిలో ఐదుగురుని పట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో స్టేట్ కమిటీ సెక్రటరీ కురసం వంజయ్య అలియాస్ అశోక్, సభ్యులు సమ్మయ్య, ముత్తయ్య, సాహెబ్, సురేశ్ ఉన్నారు. నిందితుల నుంచి పిస్టల్, 5 జిలెటిన్ స్టిక్స్, 4 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని ఎస్పీ రోహిత్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్