Siddipet: ఆటో, లారీ ఢీ.. నలుగురి మృతి

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల అలిరాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Updated : 26 May 2022 21:09 IST

జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల అలిరాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవపూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో మెదక్ వెళ్తోంది. ఆటోకి ఎదురుగా వస్తున్న లారీ ఆలిరాజ్ పేట వద్ద ఢీకొంది. ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మార్గ మధ్యలో మరణించారు. మిగిలిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని