రెండు కార్గో రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి

మధ్యప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును మోసుకెళ్తున్న రెండు కార్గో రైళ్లు సింగ్రౌలీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లోకోపైలట్‌ సహా మరో ఇద్దరు.........

Updated : 01 Mar 2020 14:45 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును మోసుకెళ్తున్న రెండు కార్గో రైళ్లు సింగ్రౌలీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో లోకోపైలట్‌ సహా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రంగంలోకి దిగిన ఎన్‌టీపీసీ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని