కారు బోల్తా: ఇద్దరి మృతి

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లలోతువాగు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...

Published : 22 May 2020 01:41 IST

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లలోతువాగు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. రఘునాథపల్లి ఎస్సై అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ పల్లెవెలుపు ప్రాంతానికి చెందిన చింతల రమేశ్‌బాబు(47), పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ బానోత్‌ రమేశ్‌(25) వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కోమల్లలోతువాగు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో చింతల రమేశ్‌బాబు అక్కడికక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్‌ బానోత్ రమేశ్‌ జనగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని