IPL 2024 Umpiring Errors: రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో...
ఐపీఎల్.. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్. మిగిలిన లీగ్లకు ఇదో రోల్ మోడల్. ఈ టోర్నీని చూసే మిగిలిన లీగ్లు నియమ నిబంధనలు ఏర్పాటుచేసుకుంటూ ఉంటాయి. అలా 17 ఏళ్లుగా టీ20 క్రికెట్లో లీగ్లకు ఓ స్థాయిని తీసుకొచ్చిన ఐపీఎల్ (IPL) ఇప్పుడు నాసిరకంగా మారిందా! 2024 సీజన్లో అంపైరింగ్ చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. దాదాపు చాలా మ్యాచ్ల్లో అంపైర్లు అధ్వాన నిర్ణయాలతో ఆటగాళ్లకే కాదు అభిమానులకు కూడా షాక్ ఇస్తున్నారు. అసలు ఇది అంపైరింగేనా అనే అనుమానాన్ని కలిగిస్తున్నారు. తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ ఫలితాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. మైదానంలో ఉన్న అంపైర్ అప్పటికప్పుడు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సరే అనుకోవచ్చు కానీ.. రివ్యూలు చూసి తీర్పు వెల్లడించే థర్డ్ అంపైర్ కూడా తప్పులు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
కోహ్లీ.. నో బాల్!
ఐపీఎల్ 17లో అంపైరింగ్ నిర్ణయాలకు బలైన ఆటగాళ్లలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో 223 పరుగుల ఛేదనలో విరాట్ (Virat Kohli) 7 బంతుల్లో 18 పరుగులు చేసి జోరు మీదున్నప్పుడు హర్షిత్ రాణా వేసిన ఓ హై నోబాల్ అతడి బ్యాట్ పైభాగంలో తగలడం బౌలర్కే క్యాచ్ వెళ్లడం జరిగిపోయాయి. దీన్ని ఫీల్డ్ అంపైర్ టెలివిజన్ అంపైర్కు పంపించాడు. రిప్లేల్లో బంతి కోహ్లీ బ్యాట్ను తాకినప్పుడు అతడు క్రీజు బయట ఉన్నట్లు.. నడుము కంటే ఎక్కువ ఎత్తులో బంతి దూసుకొచ్చినట్లు తేలింది. అయినా కూడా థర్డ్ అంపైర్ కోహ్లీని ఔట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అతడు హతాశుడయ్యాడు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే పెవిలియన్కు చేరాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడిచింది.
వైడ్ బంతులను కూడా..
బ్యాటర్ల ఔట్లే కాదు వైడ్ బంతులను కూడా సరిగా నిర్ణయించలేకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్కు గుజరాత్ పేసర్ మోహిత్శర్మ ఆఫ్ స్టంప్కు దూరంగా ఓ బంతిని విసిరాడు. దాన్ని షాట్ ఆడేందుకు శాంసన్ ఆఫ్ సైడ్ వైపు జరిగాడు. కానీ ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని వైడ్గా ప్రకటించాడు. దీంతో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రివ్యూ అడిగాడు. రివ్యూలు చూస్తే శాంసన్ కదలికలను బట్టి బంతి వైడ్ కానట్లు అనిపించింది. అందుకే థర్డ్ అంపైర్ మరోసారి రిప్లే చూశాడు. చివరికి ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడినట్లు తేల్చాడు. దీంతో గిల్ ఆశ్చర్యపోయాడు. ఇక లఖ్నవూ-దిల్లీ మ్యాచ్లోనూ ఇలాంటి తప్పిదమే జరిగింది. ఇషాంత్శర్మ వేసిన బంతి లెగ్సైడ్ పడిందని అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఫీల్డింగ్ టీమ్ రివ్యూకి వెళ్లడంతో టీవీ అంపైర్ వైడ్ కాదని తేల్చాడు. ముంబయితో మ్యాచ్లో లఖ్నవూ బ్యాటర్ ఆయుష్ బదోని రనౌట్ కూడా ఈ వివాదాస్పద నిర్ణయాల జాబితాలోకి వస్తుంది.
సంజు వివాదం
సంజు శాంసన్ను ఔట్ ఇచ్చిన తీరైతే ఇంకా దారుణం. దిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే స్థితి నుంచి ఓడిపోయింది. శాంసన్ (Sanju Samson) ఔట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. సెంచరీకి చేరువైన సంజు.. మ్యాచ్ గెలిపించే బయటకు వెళ్లాలనే పట్టుదలతో కనిపించాడు. కానీ ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో సంజు కొట్టిన భారీ షాట్ని బౌండరీ లైన్ దగ్గర షై హోప్ అందుకున్నట్లే అందుకున్నాడు. కానీ ఊపు ఆపుకోలేక అలా ముందుకు కాస్త తుళ్లాడు. ఈ క్రమంలో అతడి పాదం కొంచెం బౌండరీ లైన్కు తగిలినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్.. మూడో అంపైర్కు నివేదించాడు. విజువల్స్ చూస్తే హోప్ పాదం బౌండరీని టచ్ అయినట్లు స్పష్టంగానే కనిపించింది. ఒకవేళ ఎక్కువ స్పష్టత లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కే అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలి. కానీ అనూహ్యంగా సంజు ఔట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. సంజుకే కాదు అభిమానులకు కూడా ఈ నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది.
గతంలోనూ ఐపీఎల్లో అంపైర్ల నిర్ణయాలు తప్పుడు తడకలుగా వచ్చాయి కానీ 2024 సీజన్లో ఉన్నంత నాసిరకంగా మాత్రం ఎప్పుడూ లేవు. మున్ముందు కూడా అంపైరింగ్ ఇలాగే సాగుతుందో లేక మెరుగుపడుతుందో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..