AP News: ‘అదృశ్యం కాదది... హత్యోన్మాదమే?’
మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన కుల్లు రామసుబ్బయ్య (38) అదృశ్యం కేసు వివిధ మలుపులు తిరిగి చివరకు హత్యోన్మాదమేనన్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పోట్లదుర్తికి చెందిన కుల్లు చిన్నఎల్లాలు కుమారుడు రామసుబ్బయ్య జమ్మలమడుగు పాలిటెక్నిక్ కళాశాలలో అటెండరుగా పనిచేస్తుండేవాడు.
కుల్లు రామసుబ్బయ్య (దాచిన చిత్రం)
ఎర్రగుంట్ల, న్యూస్టుడే: కడప జిల్లా ఎర్రగుంట్ల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన కుల్లు రామసుబ్బయ్య (38) అదృశ్యం కేసు వివిధ మలుపులు తిరిగి చివరకు హత్యోన్మాదమేనన్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పోట్లదుర్తికి చెందిన కుల్లు చిన్నఎల్లాలు కుమారుడు రామసుబ్బయ్య జమ్మలమడుగు పాలిటెక్నిక్ కళాశాలలో అటెండరుగా పనిచేస్తుండేవాడు. గత నెల 24వ తేదీన కళాశాలకు విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన రామసుబ్బయ్య తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం పలు ప్రాంతాల్లో విచారించ 28న అతని భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అతనికి సన్నిహితంగా ఉన్న ప్రొద్దుటూరువాసులు ఇద్దరు, చిలమకూరు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక లాభాదేవీల కారణంగా రామసుబ్బయ్యను చంపి అన్నవరం వద్ద అతని ద్విచక్ర వాహనంతో సహా కుందు నదీలో వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రగుంట్ల ఎస్ఐలు కృష్ణయ్య, ప్రవీణ్కుమార్, చాపాడు ఎస్ఐ సుబ్బారావుతో కలిసి మంగళవారం కుందునదీ వద్ద అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కుల్లు రామసుబ్బయ్య, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..