Red Sandal: ఈ స్మగ్లర్ మరో ‘పుష్ప’.. ఎన్ని చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినా..
ఎన్ని తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసినా ‘పుష్ప’ సినిమాలో మాదిరి ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్ను కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు ..
బెళగావి: ఎన్ని తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసినా ‘పుష్ప’ సినిమాలో మాదిరి ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్ను కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు సయ్యద్ యాసిన్ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.2.45 కోట్లని అంచనా. వీటిని తరలించేందుకు వినియోగించిన లారీ విలువ రూ.పది లక్షలని తెలిపారు. బెంగళూరు సమీపంలోని ఆనేకల్ ప్రాంతానికి చెందిన నిందితుడు తన వాహనంలో కరోనా బాధితులకు పండ్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులను నమ్మించాడు. ఆ మేరకు లారీ ముందుభాగంలో పెద్ద అక్షరాలతోనూ రాయించాడు. వాహనంలోని దుంగలను ఏపీలో ఓ గుర్తుతెలియని ప్రాంతం నుంచి తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆంధ్ర, కర్ణాటక పోలీసులను నమ్మించి వెళుతున్న అతడిని మహారాష్ట్రలోని గాంధీచౌక్ ప్రాంతంలో పోలీసులు సోమవారం సాయంత్రం అడ్డుకున్నారు. అతడి వెనకనున్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ఏనుగు దాడి
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్