Crime News: ఈ దొంగ రూటే వేరు: బంగారం.. డబ్బు వదిలేసి దుస్తులెత్తుకెళ్లాడు
దొంగతనం అంటేనే.. బంగారం.. నగదు.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. అలాంటిది ఓ ఇంట్లో కేవలం కొత్త వస్త్రాలను మాత్రమే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. ఇల్లంతా చిందరవందర చేసిన సన్నివేశాన్ని చూస్తే అంతా వెతికాడని పిస్తుంది. శనివారం పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు..
పాత తాండూరు, న్యూస్టుడే: దొంగతనం అంటేనే.. బంగారం.. నగదు.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. అలాంటిది ఓ ఇంట్లో కేవలం కొత్త వస్త్రాలను మాత్రమే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. ఇల్లంతా చిందరవందర చేసిన సన్నివేశాన్ని చూస్తే అంతా వెతికాడనిపిస్తుంది. శనివారం పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే వంతెన పక్కన ఉన్న కాలనీలో మోనాచారి.. భార్య, కుమారులతో నివాసం ఉంటున్నారు. బంధువుల్లో ఒకరు ఆస్పత్రిలో ఉన్నారని ఇంటికి తాళం వేసి పరిగికి వెళ్లారు. పది రోజులుగా అక్కడే ఉన్నారు. ఆ ఇంటిని పసిగట్టిన దొంగ శుక్రవారం రాత్రి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. సామగ్రి అంతా చిందరవందర చేశాడు. బీరువాలో 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు, దుస్తులు ఉన్నాయి. ఇటీవలే కుమారుడి వివాహం కావడంతో కొత్తదుస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇల్లంతా తిరిగిన ఆ దొంగ.. బంగారం, వెండి ఆభరణాలను వదిలేసి కేవలం కొత్త ప్యాట్లు, షర్టులు, చీరలు, ఇతర వస్త్రాలను మాత్రమే మూటగట్టుకొని వెళ్లిపోయాడు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న ఇంటి యజమానురాలు హైమావతి వచ్చి దొంగతనం జరిగిందని గ్రహించి కాలనీవాసుల సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తరువాత ఇంటి తలుపులు తీసి చూశారు. బంగారం, వెండి భద్రంగానే ఉన్నాయని.. కేవలం దుస్తులు మాత్రమే పోయాయని చెబుతూ ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడికైనా ఊరెళితే మాకు సమాచారం ఇవ్వాలని.. నిఘా పెడతామని కాలనీవాసులకు పోలీసులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?