బాలిక అపహరణ కేసులో ఒకరి అరెస్టు
విజయవాడ రైల్వే స్టేషన్లో చిన్నారి హనీఫా(3)ని అపహరించింది గుడివాడకు చెందిన మహిళలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సోమవారం...
నిందితులు గుడివాడ మహిళలు!
నిందితులుగా అనుమానిస్తున్న దొండపాటి పద్మజ , కోరుకొండ విజయలక్ష్మి
గుడివాడ గ్రామీణం, రైల్వేస్టేషన్(విజయవాడ), న్యూస్టుడే : విజయవాడ రైల్వే స్టేషన్లో చిన్నారి హనీఫా(3)ని అపహరించింది గుడివాడకు చెందిన మహిళలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సోమవారం ఉదయం గుడివాడ కార్మికనగర్ వాసులు స్థానికంగా ఉన్న 413వ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి కార్యకర్త డి.జయలక్ష్మిని నిలదీశారు. ఈ గొడవపై స్థానిక సచివాలయ మహిళా పోలీసు వన్టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేసరికి నిందితులుగా అనుమానిస్తున్న అంగన్వాడీ కేంద్రం ఆయా దొండపాటి పద్మజ(చిన్నారి), అదే ప్రాంతానికి చెందిన మరో నిందితురాలైన తాపీ కార్మికురాలు కోరుకొండ విజయలక్ష్మి పరారయ్యారు. పోలీసులు వెంటనే పద్మజ కుమారుడు సందీప్ను అదుపులోకి తీసుకోగా వాస్తవాలు వెలుగులోకి రావడంతో విజయవాడ జీఆర్పీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వారు విజయలక్ష్మిని కంచికచర్ల టోల్ గేట్ సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితురాలు పద్మజ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త జయలక్ష్మికి సొంత చెల్లెలు. స్థానికులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి అక్కను ఆరా తీస్తున్న విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకొని పద్మజ పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు మహిళలు చిన్నారిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఇందులో పిల్లల్ని విక్రయించే ముఠా హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఏలూరుకు చెందిన చిన్నారి తల్లి ముస్లిం మహిళ కాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆంజనేయులు విజయవాడలో కూలీ పనులు చేస్తుండగా భార్య చెత్తకాగితాలు ఏరుతుంది. ఇద్దరూ కలిసి తారాపేట రైల్వేస్టేషన్లో ఉంటున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తామని జీఆర్పీ పోలీసులు చెపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.