Fake Mail: నకిలీ మెయిల్.. సొమ్మంతా స్వాహా
ప్రముఖ సంస్థలు.. జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాలు. రూ.కోట్లల్లో లావాదేవీలు. గోప్యంగా జరిగే వ్యవహారాల్లోనూ సైబర్ నేరగాళ్లు చొరబడుతున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉండి క్షణాల్లో రూ.లక్షలు కాజేస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్ : ప్రముఖ సంస్థలు.. జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాలు. రూ.కోట్లల్లో లావాదేవీలు. గోప్యంగా జరిగే వ్యవహారాల్లోనూ సైబర్ నేరగాళ్లు చొరబడుతున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉండి క్షణాల్లో రూ.లక్షలు కాజేస్తున్నారు. ఈ ఏడాది నగర సైబర్ క్రైమ్ పోలీసులకు సుమారు 10 ఫిర్యాదులు అందాయి. ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలను తమ చేతుల్లోకి తీసుకొని సొత్తు స్వాహా చేస్తున్నారు.
అక్షరం మార్చి..: బహుళజాతి సంస్థలు, ఫార్మా, రక్షణ, పరిశోధన, ఐటీ సంస్థలు, వ్యాపారులే మోసగాళ్ల లక్ష్యం. నైజీరియాకు చెందిన హ్యాకర్లు ప్రముఖ కంపెనీల వెబ్సైట్లు, ఈ-మెయిళ్లను హ్యాక్ చేస్తారు. ఈ-మెయిల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు, ఇన్వాయిస్ వివరాలను ముందుగానే సేకరిస్తారు. సరకు ఎగుమతి, దిగుమతుల అంశాలను గుర్తించి.. దానికి తగినట్లుగా ఈ-మెయిళ్లు, వెబ్సైట్స్ పేర్లలోని అక్షరాలను అటు ఇటుగా మార్చుతారు. నకిలీ ఈ-మెయిల్స్తో ముగ్గులోకి దింపి.. డబ్బు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. చివరకు అసలు సంస్థలు తమకు నగదు చేరలేదని చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తిస్తున్నారు.
ఎలా మోసపోయారంటే.. అమీర్పేట్కు చెందిన ప్రముఖ సంస్థ కార్లు, ఆటోల సామగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత నెల చైనా సంస్థకు ఆర్డరిచ్చారు. రూ.1.19 కోట్లు పంపితే సరకు పంపుతామంటూ ఈ-మెయిల్కు ఇన్వాయిస్ పంపారు. కొన్ని రోజులకు తాము గతంలో పంపిన బ్యాంకు ఖాతా స్తంభించిపోయిందని.. మరో ఖాతాకు నగదు పంపాలంటూ దానిలోని సారాంశం. నిజమని భావించిన సంస్థ.. కొత్త బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేశారు. రోజులు గడుస్తున్నా సరకు చేరకపోవటంతో ఆ దేశ సంస్థకు ఫోన్ చేసి అడిగారు. బాధితుడు తాను డబ్బు పంపిన ఖాతాను పరిశీలించటంతో అసలు విషయం వెలుగు చూసింది. తాను పంపిన సొమ్ము లండన్లోని ఖాతాకు చేరినట్లు గుర్తించి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతోష్నగర్లో వైద్య పరికరాలు విక్రయించే సంస్థ. తమకు అవసరమైన సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. నైజీరియన్లు మెయిల్ను హ్యాక్ చేసి.. తమ బ్యాంకు ఖాతాకు డబ్బు పంపమంటూ రూ.46 లక్షలు జమ చేయించుకున్నారు. అమెరికాకు చెందిన సంస్థ మూడు, నాలుగు నెలలకోసారి బ్యాంకు ఖాతాలు మార్చే అలవాటు ఉండటంతో నగర వ్యాపారి తేలికగా నమ్మి సొమ్ము పోగొట్టుకున్నాడు. తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థ మిధాని అల్యూమినియం కోసం కెనడా సంస్థకు ఆర్డరిచ్చారు. నిర్దేశిత సమయానికి సరకు మిధాని చేరింది. కంపెనీకి చెల్లించాల్సిన రూ.40 లక్షలు మరో బ్యాంకు ఖాతాకు జమచేయమంటూ మెయిల్కు వర్తమానం పంపారు. నిజమని భావించి ప్రతినిధులు సొమ్ము పంపారు. కెనడా సంస్థ తమకు నగదు అందలేదని, త్వరగా పంపమని ఒత్తిడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిర్ధారించుకున్నాకే లావాదేవీలు
నైజీరియన్ హ్యాకర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతుంటారు. సంస్థలు, వ్యాపారులు ఆన్లైన్లో నిర్వహించే లావాదేవీల్లోకి చేరి డబ్బు కాజేస్తున్నారు. నగదు బదిలీ చేసేటప్పుడు ఈ-మెయిల్, బ్యాంకు ఖాతా వివరాలను నిశితంగా పరిశీలించాలి. సంబంధిత సంస్థలతో మాట్లాడి నిర్ధారించుకున్నాకే లావాదేవీలు నిర్వహించాలి. ఒకటి, రెండు అక్షరాలను మార్చి అసలు మెయిల్గా నమ్మిస్తుంటారు.
- కె.వి.ఎం.ప్రసాద్, ఏసీపీ, నగర సైబర్క్రైమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్