ఘరానా చోరుడు.. జల్సారాయుడు
అతనో ఘరానా దొంగ. కన్నుపడితే ఎంతటి భద్రత ఉన్న ఇల్లయినా గుల్లయినట్టే. గ్రేటర్లోనే 90కి పైగా చోరీలు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులున్నాయి. ఎన్నిసార్లు జైలుకెళ్లినా బుద్ధి మారడంలేదు. 4 నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు జైలుకు పంపారు.
మహిళల వీడియోలు తీసి బెదిరించి వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్: అతనో ఘరానా దొంగ. కన్నుపడితే ఎంతటి భద్రత ఉన్న ఇల్లయినా గుల్లయినట్టే. గ్రేటర్లోనే 90కి పైగా చోరీలు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులున్నాయి. ఎన్నిసార్లు జైలుకెళ్లినా బుద్ధి మారడంలేదు. 4 నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు జైలుకు పంపారు. ఇటీవల నగరం, శివారుల్లోని కల్లు దుకాణాలు, మార్కెట్లు, తోపుడు బండ్ల వద్ద ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినపుడు విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూసినట్టు సమాచారం.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నేరస్థుడు(30) మారు పేర్లతో తిరుగుతుంటాడు. ఆచూకీ తెలుస్తుందని ఆధార్కార్డు తీసుకోలేదు. కొద్దికాలం యాదాద్రి జిల్లా బీబీనగర్లో ఉన్నాడు. కారు డ్రైవర్గా పనిచేసేవాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఐడీఏ బొల్లారానికి వచ్చి, ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2017లో నగర పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి రూ.50 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎత్తులు వేయటంలో తెలివిగా వ్యవహరిస్తాడంటూ సైబరాబాద్కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఖరీదైన ఇళ్లు, ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. అర్ధరాత్రి దాటాక స్క్రూడ్రైవర్, ఇనుప రాడ్ సాయంతో ఇంట్లోకి ప్రవేశించి చోరీలు చేసి జారుకుంటాడు.
చోరీల్లో మరో రూటు
ఆభరణాలు కొట్టేసేందుకు కల్లు, మద్యం దుకాణాలు, తోపుడుబండ్లు, కాలిబాట మార్గాల్లో చిరువ్యాపారాలు నిర్వహించే మహిళలను గుర్తిస్తాడు. 30-40 ఏళ్లలోపు మహిళలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసేందుకు వెళ్లినట్టుగా మాట కలుపుతాడు. మద్యం అలవాటున్న వారికి తాగించి నిర్మానుష్య ప్రదేశానికి కొందరిని, మరి కొందరిని హోటల్ గదులకు తీసుకెళతాడు. ఆ మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు తన చరవాణితో చిత్రీకరిస్తాడు. అవి చూపి బెదిరించి నగలు, నగదు డిమాండ్ చేస్తాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబంలో కలతలు వస్తాయని అతను అడిగినంత ఇచ్చేస్తున్నారని, ఫిర్యాదులకు వెనుకంజ వేస్తున్నారంటూ ఓ సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం