అనిశాకు చిక్కిన సంగారెడ్డి డీఈవో
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి(డీఈవో) నాంపల్లి రాజేశ్ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ ద్వారా ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50 వేలను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఎన్వోసీకి రూ.1.10 లక్షల డిమాండ్
రూ.50 వేలు తీసుకుంటూ దొరికిన వైనం
ఈనాడు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా విద్యాధికారి(డీఈవో) నాంపల్లి రాజేశ్ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ ద్వారా ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50 వేలను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు. అనిశా మెదక్ రేంజ్ డీఎస్పీ ఆనంద్ తెలిపిన ప్రకారం... రామచంద్రాపురం మండలానికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎస్సెస్సీ సిలబస్ నుంచి ఐసీఎస్ఈకి మారాలనుకుంది. నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) కోసం అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సమర్పించింది. ఎంఈవో సంబంధిత దస్త్రాన్ని జిల్లా కార్యాలయానికి పంపారు. ఈ పని పూర్తి చేయడానికి రూ.1.10 లక్షలు లంచమివ్వాలంటూ డీఈవో రాజేశ్ డిమాండ్ చేశారు. అంగీకరించని పాఠశాల యజమాని ఈ నెల 15న అనిశాను సంప్రదించారు. వారి సూచనల మేరకు, రెండు విడతలుగా లంచం ఇస్తానని డీఈవోను ఒప్పించారు. శుక్రవారం మధ్యాహ్నం రూ.50 వేలు తీసుకొని సంగారెడ్డి డీఈవో కార్యాలయానికి వెళ్లి, విధుల్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణగౌడ్కు అందించారు. ఆ సమయంలో రాజేశ్ అక్కడే ఉన్నారు. డబ్బులు తీసుకోగానే అనిశా డీఎస్పీ ఆనంద్తోపాటు ఇన్స్పెక్టర్లు వెంకట్రాజ్, నాగేష్, శ్రీనివాస్, రమేష్లు నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత వారిద్దరి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు.
నాంపల్లి రాజేశ్ 2016-18 వరకు నిజామాబాద్ డీఈవోగా పనిచేశారు. అప్పట్లో మరికొన్ని రోజుల్లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ)గా పదోన్నతి వస్తుందనగా.. నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. విచారణలో వాస్తవాలు వెలుగుచూడటంతో రాజేశ్ను 2018 అక్టోబరులో బాధ్యతల నుంచి తప్పించి, హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. తర్వాత 2020లో సంగారెడ్డి డీఈవోగా నియమించారు. త్వరలోనే ఆర్జేడీగా పదోన్నతి వచ్చేందుకు అవకాశముందని భావిస్తుండగా, మరోసారి అనిశాకు దొరకడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Pak spy: పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా