Bhadradri Kothagudem: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉందని సోదరి హత్య

చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన సోదరుడు ఆమెను రోకలిబండతో మోది హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం జరిగింది.

Updated : 26 Jul 2023 08:15 IST

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన సోదరుడు ఆమెను రోకలిబండతో మోది హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం జరిగింది. రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులను పిలవడంతో అసలు విషయం బయటపడింది. సీఐ కరుణాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్‌ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్‌ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్‌ చేస్తున్న సింధు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఇది నచ్చని హరిలాల్‌ ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హరిలాల్‌ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ తీసుకెళ్తుండగా మృతిచెందారు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే హరిలాల్‌ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని