Crime News: కుమార్తెను చంపి.. బైక్‌కు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి కన్నకూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

Updated : 12 Aug 2023 09:44 IST

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి కన్నకూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనానికి మృతదేహాన్ని కట్టి, ఊరంతా ఈడ్చుకెళ్లాడు. నిందితుడు బౌ ఓ కూలీ. బుధవారం.. అతడి కుమార్తె (20) ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి, మరుసటిరోజు తిరిగి వచ్చింది. తీవ్రమైన ఆగ్రహంతో బౌ ఆమెపై విరుచుకుపడ్డాడు. తీవ్రంగా కొట్టి పదునైన ఆయుధంతో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనానికి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లి దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు. ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. నిందితుణ్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కుల్దీప్‌సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని