అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం జిల్లా యువకుడి మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్‌రెడ్డి కుమారుడు సాయిరాజీవ్‌రెడ్డి (28) అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Published : 09 Jan 2024 03:48 IST

పెనుబల్లి, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్‌రెడ్డి కుమారుడు సాయిరాజీవ్‌రెడ్డి (28) అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయిరాజీవ్‌రెడ్డి.. ఓ పార్సిల్‌ తీసుకోవడానికి తన కారులో విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి ఈ కారును ఢీకొట్టింది. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే మృతి చెందారని తెలిసింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తండ్రి భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా ప్రయాణమయ్యారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి వివాహం జరిగింది. మృతుని సోదరి శిల్పారెడ్డి టెక్సాస్‌లోనే నివాసం ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని