బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసుల నమోదు
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
భీమారం, న్యూస్టుడే: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అతనిపై హనుమకొండ జిల్లా కేయూ పోలీసుస్టేషన్లో శుక్రవారం అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ సీఐగా పని చేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్లో ఎస్సైగా పని చేశాడు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగేవాడు. అనంతరం ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయినా ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ సీఐగా బదిలీపై వచ్చాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సదరు మహిళ కూతురి(16)పై కన్నేశాడు. అదను చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన పోలీసులు.. సీఐ సంపత్పై అత్యాచారంతోపాటు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు