సామాజిక మాధ్యమాల్లో గొప్పలు.. లంచాల కోసం తప్పులు!
ఆమె ప్రభుత్వ ఉద్యోగి.. ఆదివారం వస్తే వ్యవసాయ పనులకు వెళ్తూ.. వచ్చిన కూలి డబ్బులతో ఇతరులకు సాయం చేస్తున్నట్లు, ట్రస్టు నిర్వహిస్తున్నానంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్న ఆమె లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.
అనిశాకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమా
ఈనాడు, మహబూబాబాద్ - మహబూబాబాద్, నెహ్రూసెంటర్, న్యూస్టుడే: ఆమె ప్రభుత్వ ఉద్యోగి.. ఆదివారం వస్తే వ్యవసాయ పనులకు వెళ్తూ.. వచ్చిన కూలి డబ్బులతో ఇతరులకు సాయం చేస్తున్నట్లు, ట్రస్టు నిర్వహిస్తున్నానంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్న ఆమె లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి ముడుపులు తీసుకుంటున్న మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎ.వెంకట్ను అనిశా అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వరంగల్ రేంజ్ అనిశా డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల మేరకు.. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ దంతాలపల్లిలో ఎకరం 28 గుంటలు వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇందులో 128 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్రిజిస్ట్రార్ తస్లీమాను సంప్రదించగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ను కలిస్తే పూర్తి వివరాలు చెబుతారని పంపించారు. డాక్యుమెంటేషన్ ఫీజు కాకుండా గజానికి రూ.200 అదనంగా ఇవ్వాలని వెంకట్ డిమాండ్ చేశారు. దీంతో ఆ సొమ్ము ఇవ్వలేనని చెప్పడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు వారు అంగీకరించలేదు. రెండు, మూడు సార్లు కార్యాలయం చుట్టూ తిరిగి విసుగుచెందిన హరీష్.. వరంగల్లోని అనిశా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి గజానికి రూ.150 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని స్లాట్ నమోదు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం హరీష్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్కు రూ.19,200 ఇస్తుండగా.. అనిశా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇవే కాకుండా అదనంగా లెక్కలు లేకుండా రూ.1.72 లక్షలు వెంకట్ వద్ద ఉన్నాయి. వాటినీ స్వాధీనం చేసుకొని సబ్రిజిస్ట్రార్ తస్లీమా, వెంకట్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని.. శనివారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అనిశా అధికారులు తెలిపారు. అనిశా ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్