వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్‌ బాల్‌ తగిలి బాలుడి మృతి

వేసవి సెలవుల్లో క్రికెట్‌ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్‌ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్‌కు చెందిన శంభు కాళిదాస్‌ ఖాండ్వే అలియాస్‌ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడటానికి వెళ్లాడు.

Published : 07 May 2024 06:27 IST

పుణె: వేసవి సెలవుల్లో క్రికెట్‌ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్‌ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్‌కు చెందిన శంభు కాళిదాస్‌ ఖాండ్వే అలియాస్‌ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడటానికి వెళ్లాడు. ఆటలో వేగంగా వచ్చిన బంతి శౌర్య మర్మావయవాలను బలంగా తాకడంతో అతడు కుప్పకూలి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనకు గురైన స్నేహితులు బాలుడిని మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారు. చుట్టుపక్కలవారు అతణ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు