శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి
కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్తెలిపారు. మైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు.........
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కె.బి.శివకుమార్ తెలిపారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ఓ ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులంతా బిహార్కు చెందిన కార్మికులుగా గుర్తించారు.
గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శివమొగ్గతో పాటు పొరుగున ఉన్న దావణగెరె, చిక్మగళూరు జిల్లాల్లోనూ కలకలం రేపింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు ఇళ్లలో కిటికీలు ధ్వంసమవ్వగా, రోడ్లకు బీటలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తొలుత అందరూ భూకంపంగా భావించారు. తర్వాత పేలుడు జరిగిందని నిర్థరణకు వచ్చారు. ఘటనాస్థలంలో పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు గుర్తుపట్టలేని రీతిలో ఛిద్రమైపోయాయని సమాచారం. మృతుల శరీర భాగాలు దాదాపు 1.5 కి.మీ వరకు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావాల్సిన సహకారం అందిస్తోందని తెలిపారు.
ఇవీ చదవండి...
బాగ్దాద్లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి
నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?