Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
జూబ్లీహిల్స్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను చంచల్ గూడ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు. న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ను, ఆ తర్వాత సైదాబాద్లోని జువైనల్ హోంకు తీసుకొచ్చి ఐదుగురు మైనర్ బాలుర గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. నిందితులందరినీ మైనర్ బాలిక గుర్తించింది. బాధితురాలు తెలిపిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.
మరోవైపు అత్యాచారం కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారి డీఎన్ఏ సేకరించడానికి అనుమతివ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, అందుకు అనుమతి లభించింది. నిందితుల డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నారు. అత్యాచారం జరిగిందని పోలీసులు చెబుతున్న ఇన్నోవా వాహనంలో క్లూస్ టీం ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది. డీఎన్ఏ నివేదికతో ఇన్నోవా వాహనంలో దొరికిన ఆధారాలను పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారని పక్కాగా నిరూపించడానికి పోలీసులకు డీఎన్ఏ నివేదిక ఎంతో కీలకం కానుంది. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించేందుకు కోర్టు అనుమతి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మైనర్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నిందితులు విదేశాలకు పారిపోకుండా ముందస్తు జాగ్రత్తగా వారి పాస్పోర్టులను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం