Telangana News: ప్రేమమోజులో రూ.6 లక్షలతో ఉడాయించిన కూతురు

మేడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రేమికులను పట్టుకున్న పోలీసులు

Updated : 10 Feb 2022 08:28 IST

తండ్రి ఫిర్యాదుతో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మేడిపల్లి, న్యూస్‌టుడే: మేడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రేమికులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తన కుటుంబంతో సన్నిహితంగా ఉండే యువకునితో ప్రేమలో పడింది. యువకుని మాటలతో మోసపోయి తన తండ్రి కుటుంబ అవసరాల కోసం ఇంట్లో దాచిన రూ.6 లక్షలు తీసుకుని యువకునితో వెళ్లిపోయింది. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు పదిరోజులపాటు గాలించి ప్రేమికుల ఆచూకీతోపాటు వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ యువతీ, యువకులు ప్రేమపేరిట తప్పుడు మార్గాల్లో వెళ్లి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువతీ, యువకుల ఆచూకీ కనిపెట్టడం, సొమ్మును అప్పగించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్సై సుధీర్‌రావు, సిబ్బంది చంద్రశేఖర్‌, భగవాన్‌, విజయ్‌ను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు