Telangana News: ప్రేమమోజులో రూ.6 లక్షలతో ఉడాయించిన కూతురు
మేడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రేమికులను పట్టుకున్న పోలీసులు
తండ్రి ఫిర్యాదుతో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మేడిపల్లి, న్యూస్టుడే: మేడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు ప్రేమికులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తన కుటుంబంతో సన్నిహితంగా ఉండే యువకునితో ప్రేమలో పడింది. యువకుని మాటలతో మోసపోయి తన తండ్రి కుటుంబ అవసరాల కోసం ఇంట్లో దాచిన రూ.6 లక్షలు తీసుకుని యువకునితో వెళ్లిపోయింది. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు పదిరోజులపాటు గాలించి ప్రేమికుల ఆచూకీతోపాటు వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్రాజు మాట్లాడుతూ యువతీ, యువకులు ప్రేమపేరిట తప్పుడు మార్గాల్లో వెళ్లి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువతీ, యువకుల ఆచూకీ కనిపెట్టడం, సొమ్మును అప్పగించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్సై సుధీర్రావు, సిబ్బంది చంద్రశేఖర్, భగవాన్, విజయ్ను అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రాజప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాలాల మండలం దౌలాపూర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా