వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య

వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

Updated : 19 Mar 2024 09:01 IST

సీతాపుర్‌: వంట చేయడంలో ఆలస్యమైందని గొడవపెట్టుకున్న భర్త విచక్షణ మరిచి భార్యను హతమార్చాడు. అనంతరం తాను సైతం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌ జిల్లా థంగావ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను ప్రేమాదేవి (28), పరశురాం(30)గా గుర్తించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనుల కోసం బయటకెళ్లిన పరశురాం ఇంటికి వచ్చి భోజనం తీసుకురావాలని భార్యను అడిగాడు. వంట సిద్ధం కాకపోవడంతో ఆగ్రహానికి గురైన అతడు భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో అతడు పదునైన ఆయుధంతో పలుమార్లు దాడిచేసి చంపాడు. అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో గడియపెట్టుకొని ఉరివేసుకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని