Crime news: ఐదుగురు కుటుంబీకులను హత్యచేసి.. ఆపై ఇంటికి నిప్పంటించి!
ఉత్తర్ప్రదేశ్లో మరో సామూహిక హత్యాకాండ ఘటన వెలుగుచూసింది. ప్రయాగ్రాజ్ ప్రాంతం ఖేర్వాజ్పుర్ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.......
ప్రయాగ్రాజ్: ఉత్తర్ప్రదేశ్లో మరో సామూహిక హత్యాకాండ ఘటన వెలుగుచూసింది. ప్రయాగ్రాజ్ ప్రాంతం ఖేర్వాజ్పుర్ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు రాళ్లు, ఇటుకలతో కుటుంబీకులను హత్యచేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా వారి ఇంటికి నిప్పంటించారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.
గారాపూర్ నుంచి సికంద్రా వెళ్లే రోడ్డు పక్కన ఖేర్వాజ్పుర్ గ్రామంలో రాజ్కుమార్ యాదవ్(55) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ తెల్లవారుజామున వారింట్లోకి ప్రవేశించిన దుండగులు రాజ్కుమార్ యాదవ్తోపాటు ఆయన భార్య కుసుమ్ దేవి(53), దివ్యాంగురాలైన కుమార్తె మనీషా కుమారి(25) కోడలు సవిత(23), మనవరాలు సాక్షి(2)ని దారుణంగా హతమార్చారు. ఇంటికి నిప్పంటించగా పొగలు రావడంతో గమనించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం అందించారు.
అగ్నిమాపక బృందం, పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. మృతులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. హత్యకు ముందు హత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.