Andhra News: తుప్పలకు నిప్పు పెట్టిన ఓ రైతు.. రహస్యంగా దాచిన నగదు బుగ్గి
చెరువు గట్టుపైనున్న తుప్పలు కాల్చేందుకు ఓ రైతు పెట్టిన మంటలు వ్యాపించడంతో సమీప పొలాల్లోని ధాన్యం బస్తాలు, నగదు కాలిపోయిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలంలో జరిగింది.
బలిజిపేట, న్యూస్టుడే: చెరువు గట్టుపైనున్న తుప్పలు కాల్చేందుకు ఓ రైతు పెట్టిన మంటలు వ్యాపించడంతో సమీప పొలాల్లోని ధాన్యం బస్తాలు, నగదు కాలిపోయిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలంలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తుమరాడ గ్రామంలోని కృష్ణసాగరం ఒడ్డున శుక్రవారం ఓ రైతు నిప్పు పెట్టారు. మధ్యాహ్నానికి మంటలు పక్కనున్న పొలాల్లోకి వ్యాపించాయి. ప్రమాదంలో మిర్తివలసకు చెందిన గండబోను సింహాచలం, తుమరాడకు చెందిన దాసరి మజ్జయ్య, పడాల అప్పయ్య, విమల, సత్యనారాయణ తదితరులు 17 మందికి చెందిన సుమారు రూ.8లక్షల విలువైన 370 బస్తాల ధాన్యం కాలిబూడిదైంది. చిరు వ్యాపారి గండబోను సింహాచలం తుమరాడకు చెందిన రైతుల వద్ద వంద బస్తాల ధాన్యం కొని పొలాల్లోనే ఉంచారు. రైతులకు నగదు చెల్లించేందుకు శుక్రవారం బలిజిపేటలోని వివిధ బ్యాంకులకు వెళ్లి రూ.2లక్షల నగదు తెచ్చుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉండగా ఆయన ధాన్యం బస్తాలు కాలిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనున్న మొత్తం నగదును తుప్పల్లో రహస్యంగా ఉంచి వెళ్లారు. మంటలు ఆ ప్రాంతానికీ వ్యాపించి నగదు కాలిపోయి బోరుమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం