Crime news: మెట్రో స్టేషన్‌ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...

Published : 01 Oct 2021 01:59 IST

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్యకు ప్రయత్నించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని