Kakinada: పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Updated : 23 Sep 2023 10:26 IST

జగ్గంపేట: కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఉప్పలపాడులో విషాదం నెలకొంది. పామాయిల్‌ తోటలో వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. పొలంలోని విద్యుత్ తీగలు పైపులకు తగలడంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని