ఆమె గుండె ఆగింది.. అయినా ఉరి ఆగలేదు!
సాధారణంగా దోషులకు ఉరిశిక్ష చాలా పకడ్బందీగా అమలు చేస్తుంటారు. ఉరిశిక్షకు ముందు ఖైదీకి అన్ని రకాల ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉంటేనే ఉరిశిక్ష వేస్తుంటారు. కానీ, ఇరాన్లో ఇటీవల ఓ మహిళ ఉరిశిక్ష పడే కొన్ని క్షణాల ముందే గుండెపోటుతో మృతి చెందింది. అయినా
తెహ్రాన్: సాధారణంగా దోషులకు ఉరిశిక్ష చాలా పకడ్బందీగా అమలు చేస్తుంటారు. ఉరిశిక్షకు ముందు ఖైదీకి అన్ని రకాల ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉంటేనే ఉరిశిక్ష వేస్తుంటారు. కానీ, ఇరాన్లో ఇటీవల ఓ మహిళ ఉరిశిక్ష పడే కొన్ని క్షణాల ముందే గుండెపోటుతో మృతి చెందింది. అయినా పోలీసులు ఆమె మృతదేహాన్ని ఉరికంభం ఎక్కించారు.
ఇరాన్కి చెందిన ఇద్దరు పిల్లల తల్లి జెహ్రా ఇస్మాయిలీ కొన్నాళ్ల కిందట తన భర్తను హత్య చేసింది. నిత్యం తనను, తన కూతుర్ని వేధిస్తుండటంతో భరించలేక భర్త ప్రాణాలు తీసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆత్మరక్షణ కోసం హత్య చేసినా ఒకరి ప్రాణాలు తీసిన నేరానికి ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించింది. గత వారం దేశ రాజధానికి 20 మైళ్ల దూరంలో ఉన్న కారజ్ పట్టణంలోని ఓ జైలులో జెహ్రా ఉరిశిక్ష అమలుకు అంతా సిద్ధం చేశారు. ఆమెతో పాటే మరో 16 మంది ఖైదీలకు పోలీసులు ఉరిశిక్ష అమలు చేశారు. క్యూలో తన ముందున్న వ్యక్తులు ఉరికంభం ఎక్కి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోవడం చూసి జెహ్రా ఆందోళనకు గురైంది. ఆ వెంటనే గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అయినా పోలీసులు చట్టం ప్రకారం ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. దీంతో జెహ్రా మృతదేహాన్ని తీసుకెళ్లి మెడకు ఉరి బిగించారు. ఆమె భర్త తల్లి.. మృతదేహాన్ని నిలబెట్టిన కుర్చీని తన్నడంతో ఉరిశిక్ష అమలు పూర్తయిందని ఈ కేసును వాదించిన న్యాయవాది తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.