నిర్మల్ నేతలదే ఆధిపత్యం
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.
పార్లమెంట్కు వెళ్లింది 12 మంది
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి గెలుపొందిన అభ్యర్థులు, వారి పార్టీ, పదవీ కాలం, తదితర వివరాలతో కథనం.
న్యూస్టుడే, నిర్మల్, మామడ: ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటి దాకా 18 సార్లు ఎన్నికలు జరిగాయి. గెలిచి పార్లమెంట్కు వెళ్లిన వ్యక్తులు మాత్రం 12 మందిగానే చెప్పొచ్చు. ఎందుకంటే మాధవరెడ్డి, గంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి రెండేసి సార్లు, వేణుగోపాలాచారి మూడు సార్లు విజయం సాధించారు. వీరు కాకుండా మరో ఏడుగురు ఎంపీగా ఆదిలాబాద్ నుంచి లోక్సభకు వెళ్లారు.
తొమ్మిది పర్యాయాలు ఎంపీలుగా అక్కడి వారే
పూర్వం రాజులు పాలించిన ప్రాంతం నిర్మల్. అప్పటి నుంచి రాజకీయ నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్న ఇక్కడి ప్రాంతవాసులు జిల్లా, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండులే కావడం గమనార్హం. గడిచిన ఆరు దశాబ్దాలకుపైగా ఈ ప్రాంతం రాజకీయ ఖిల్లాగా వర్ధిల్లుతోంది. పదవులతోపాటు పార్టీ పరమైన బాధ్యతలతో ఈ ప్రాంత నాయకులే ఆధిపత్యం వహిస్తూ వస్తున్నారు. రాజకీయ, సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న నిర్మల్ ప్రాంతంలోని నేతలు ఉన్నత విద్యాభాస్యం చేసిన వారే. ఇందులో చాలామంది న్యాయవాదులు, వైద్యులు కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వివిధ ఎన్నికల్లో ఈ ప్రాంత నాయకులే పోటీచేస్తూ గెలుపొందుతూ వచ్చారు. జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, పార్లమెంటు సభ్యులుగా, రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రాంత నేతలే ఇప్పటివరకు ఎక్కువగా కొనసాగారు. పార్టీల అధ్యక్ష పదవులు చేపట్టిన వారిలోనూ వీరిదే ఆధిపత్యం కొనసాగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం గిరిజనులకు రిజర్వ్ అయ్యే వరకు ఇదే ఒరవడి సాగింది.
హ్యాట్రిక్ విజయం, ఉప ఎన్నికలో గెలుపు
ఇప్పటివరకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ఒక ఉప ఎన్నికతోపాటు 17 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇందులో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నేత నిర్మల్కు చెందిన వేణుగోపాలాచారి ఒక్కరే కావడం గమనార్హం. ఈయన 1996, 1998, 1999లలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన మధుసూదన్రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2008లో రాజీనామా చేశారు. అప్పుడు ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో నాటి నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు.
ఒకరు మూడుసార్లు.. ఇద్దరు రెండుసార్లు
1952 నుంచి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన వారు నిర్మల్ ప్రాంత నేతలు కావడం గమనార్హం. ఇదివరకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి 17 సార్వత్రిక ఎన్నికలు, ఓ సారి ఉప ఎన్నిక జరిగింది. ఇందులో తొమ్మిది పర్యాయాలు నిర్మల్ జిల్లా నేతలే ఎంపీలుగా గెలుపొందారు. ఇందులో ఒకరు మూడుసార్లు, ఇద్దరు రెండుసార్లు, మరో ఇద్దరు ఒక్కోసారి ఎంపీగా విజయం సాధించారు. 1962-1967 మధ్య కాలంలో జి.నారాయణరెడ్డి (కాంగ్రెస్), 1967-1970, 1971-1977 మధ్య కాలంలో రెండు పర్యాయాలు వరుసగా పదేళ్లు పొద్దుటూరి గంగారెడ్డి (కాంగ్రెస్) ఎంపీగా ఉన్నారు. 1989-1991 వరకు పొద్దుటూరి నర్సారెడ్డి (కాంగ్రెస్), 1991-1996 మధ్య అల్లోల ఇంద్రకరణ్రెడ్డి (తెదేపా), 1996-1998, 1998-1999, 1999-2004 వరకు వరుసగా మూడుసార్లు డా.వేణుగోపాలాచారి (తెదేపా) హ్యాట్రిక్ విజయం సాధించారు. 2008లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. ఆ తర్వాత ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ కావడంతో అప్పటి నుంచి ఇక్కడి నేతలు పోటీ చేయలేదు. ఇందులో పొద్దుటూరి నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. డా.వేణుగోపాలాచారి కేంద్ర విద్యుత్తు, వ్యవసాయ సహాయ మంత్రిగా కొనసాగారు. అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వీరితోపాటు పలువురు జడ్పీ ఛైర్మన్లుగా, డీసీఎంఎస్ అధ్యక్షులుగా, డీసీసీబీ ఛైర్మన్లు, ఇలా ఎన్నో పదవులు ఇక్కడి నేతలే చేపట్టడం గమనార్హం.
ఓటు హక్కుతో పోరాడి రాజులు అవుతారో అమ్ముకొని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లో ఉంది
అంబేడ్కర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాంనగర్ యువకుడికి పీహెచ్డీ పట్టా
[ 02-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం మారుమూల పల్లె రాంనగర్ చెందిన యువకుడు చంద్రకాంత్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురువారం పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది. -
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు స్థానిక టీఎన్జీవో భవనంలో ఆరోగ్య పరీక్షలను ... -
సీపీఎం పార్లమెంట్ స్థాయి సమావేశం జయప్రదం చేయండి
[ 02-05-2024]
సీపీఎం పార్టీ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం 3న స్థానిక యాదవ సంఘ భవనంలో నిర్బహించనున్నట్లు ... -
మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలంలోని వడ్డాడిలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పొన్నారిలో భారాస ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్