logo

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Published : 04 May 2024 06:03 IST

భైంసా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి రోజు మొత్తం 86 మంది ఉద్యోగులు, జర్నలిస్టులు ఓటు వేసినట్లు ఆర్డీవో కోమల్‌రెడ్డి తెలిపారు. వయోవృద్ధులు సైతం దరఖాస్తు చేసుకోగా ఇంటి నుంచి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పట్టణంతో పాటు మండలంలోని 23 మంది వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని