నిత్యం అ‘శాంతి’..!
జిల్లా దేవాదాయశాఖలో ఒక వెలుగు వెలిగిన పూర్వ సహాయ కమిషనర్ కె.శాంతి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. బదిలీపై ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లినప్పటికీ ఆమెను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక విధంగా విశాఖ రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో ఇక్కడి నుంచి అంతే వేగంగా ఆమెపై దేవాదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదులు వెళుతున్నాయి.
వివాదాల నుంచి కేసు వరకు..
బదిలీపై వెళ్లినా వీడని విచారణలు
విశాఖపట్నం, న్యూస్టుడే
కె.శాంతి, పూర్వ సహాయ కమిషనర్, జిల్లా దేవాదాయశాఖ
జిల్లా దేవాదాయశాఖలో ఒక వెలుగు వెలిగిన పూర్వ సహాయ కమిషనర్ కె.శాంతి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. బదిలీపై ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లినప్పటికీ ఆమెను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక విధంగా విశాఖ రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో ఇక్కడి నుంచి అంతే వేగంగా ఆమెపై దేవాదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఆయా ఫిర్యాదులపై ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల విశాలక్షినగర్లోని తన నివాసం వద్ద జరిగిన గొడవలో తాజాగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేసు నమోదైన నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేపట్టాలని దేవాదాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు 16, 17 తేదీల్లో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
వైకాపా ముఖ్య నేత అండదండలతో..
* జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్గా 2020 మే నెలలో శాంతి నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్ 30 వరకు ఇక్కడ సేవలందించారు. 25నెలల పాటు జిల్లాలో పనిచేసిన ఆమె పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఉప కమిషనర్ పుష్పవర్ధన్పై ఇసుక చల్లి కొత్త వివాదానికి తెరలేపారు. వైకాపాకు చెందిన ముఖ్య నేత అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
* డీసీ క్యాడర్లో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ (ఇన్ఛార్జి)గా నాలుగు నెలల పాటు పనిచేశారు. సూపరింటెండెంట్ క్యాడర్ స్థాయి ఆలయమైన ఎర్నిమాంబ ఆలయ ఈఓగా ఏడాదికిపైగా సేవలందించారు. ఈ ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను అనధికారికంగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె బదిలీ తర్వాత ఆయా నియామకాలను రద్దు చేశారు. నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై తాజాగా ఆర్జేసీ (కాకినాడ) సురేష్బాబు విచారణ జరిపారు. విచారణ నివేదికను త్వరలో కమిషనర్కు అందజేయనున్నట్లు తెలిసింది.
వ్యవహారశైలిపై ఫిర్యాదులు
* కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓగా నాలుగు నెలలే పనిచేసినప్పటికీ పలు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ అనుమతులు లేకుండా పీఆర్వో, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. దీనిపై పాలకమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆలయంలో శటారి, తీర్థం ఇచ్చే పద్ధతిలో మార్పు చేశారు. అమ్మవారి దర్శనాలకు వీలుగా ఏర్పాటు చేసిన చెక్క కారిడార్ను తొలగించారు. 24గంటల దర్శనాలను సైతం నిలిపివేశారు. శాంతి వ్యవహారశైలిని తప్పుబడుతూ పాలక మండలి కమిషనర్కు ఫిర్యాదు చేసింది. మళ్లీ ఈమె ఆలయ ఇన్ఛార్జి ఈఓగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగడంతో పాలకమండలి అప్రమత్తమై ఆమెను ఎట్టి పరిస్థితిలో ఈఓగా నియమించవద్దని కోరుతూ లేఖ పంపారు. వైకాపా ముఖ్యనేతల దృష్టికి శాంతి వ్యవహార శైలిని తీసుకెళ్లడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం