సాయంలో వివక్ష.. పరిహారంలో పరీక్ష
గోదావరి వరదలు విలీన మండలాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆదుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీలో వివక్ష చూపుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పులతడకలుగా వరద సర్వేలు
అధికార పార్టీ నాయకులపై బాధితుల ధ్వజం
గన్నేరుకొయ్యల పాడులో పునరావాస కేంద్రానికి సామగ్రి తరలిస్తున్న బాధితులు
ఎటపాక, న్యూస్టుడే: గోదావరి వరదలు విలీన మండలాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆదుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీలో వివక్ష చూపుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు బారిన పడి బిక్కుబిక్కుమంటూ అడవుల్లోనే నెలల తరబడి గడిపామని గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో అందిన తక్షణ సహాయం అంతంతమాత్రమే. నిత్యావసరాలు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు ముంపునకు గురికావడం, వారాల తరబడి వరద ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఈనేపథ్యంలో ఎటపాక మండలంలోని 13 గ్రామ సచివాలయాల పరిధిలో 329 ఇళ్లు పూర్తిగా, 657 పాక్షికంగా దెబ్బతిన్నాయి.
వరద తగ్గినా బాధితులకు ఇబ్బందులు తగ్గలేదు. తడి ఆరేందుకు రెండు వారాలు పట్టింది. ఇళ్లన్నీ మట్టితో నిండిపోయాయి. వాటిని శుభ్రం చేసుకునేందుకు వేలల్లో ఖర్చు పెట్టారు. గన్నేరుకొయ్యలపాడు శివారు రెండు వీధుల్లో ఇళ్లన్నీ ముంపునకు గురయ్యాయి. సుమారు 120 కుటుంబాల వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల సర్వేలో కేవలం ఆరిళ్లు మాత్రమే దెబ్బతిన్నట్లు చూపారు. వరదలకు సర్వం కోల్పోయిన తమపట్ల అధికారుల తీరు విడ్డూరంగా ఉందని బాధితులు చెబుతున్నారు. ఓ వైపు వరదలు నష్టాన్ని మిగిలిస్తే అధికారులు తీరుతో సాయం అందకుండా పోతోందంటున్నారు.
స్వచ్ఛంద సంస్థలే నయం
వరదల సమయంలో ప్రభుత్వం కంటే స్వచ్ఛంద సేవా సంస్థలే తమకు ఎక్కువ సహాయం అందించినట్లు బాధితులు చెబుతున్నారు. నెల్లాళ్ల పాటు వరదలో ఉండటంతో ఇళ్ల నిండా చెత్తా చెదారం, మట్టి పేరుకుపోయాయి. ఇళ్లు కుంగిపోయి నెర్రలు ఏర్పడ్డాయి. ఇవన్నీ సర్వే చేసినా పరిహారానికి నోచుకోలేదు.
బ్యాంకులకెళితే నిరాశే..!
తాజాగా ప్రభుత్వం వరద సాయం బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు నగదు జమ చేసింది. దానికోసం ఆశగా బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. కొందరికి నగదు జమ కావడం, మరికొందరికి కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాయం అందించడానికి, సర్వేల సమయంలో పలు గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేశారని, అర్హులకు మొండిచెయ్యి చూపించారని పలువురు ఆరోపిస్తున్నారు.
నాలుగు వారాలు ముంపులోనే: వరదలకు మా ఇల్లు నాలుగు వారాలు ముంపులోనే ఉంది. పునరావాస కేంద్రాల్లో నానా ఇబ్బందులు పడ్డాం. సర్వే చేశారు, నగదు జమ కాలేదు. ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు పదిహేను వేలు ఖర్చయ్యింది. కనీసం సాయం అందినా బావుండేది. అధికారుల నిర్లక్ష్యంతోనే సాయం కోల్పోయా.
నాగమణి, గన్నేరుకొయ్యలపాడు
సర్వే ఎందుకు చేశారూ:
వరదలకు ఇళ్లు మునిగిపోయాయి. సచివాలయ సిబ్బంది నన్ను ఇంటి ముందు పెట్టి ఫొటో తీసుకున్నారు. పరిహారం నమోదు అయిందని చెప్పారు. తీరా ఇప్పుడు నగదు జమ కాలేదు. కావాలనే తొలగించారా?, ఎందుకు సర్వే చేశారు. వరద సాయం అందించాలి.
ములకలపల్లి వెంకటేశ్వర్లు, బాధితుడు
అన్నీ ఉన్నతాధికారులకు పంపాం
సర్వే చేసి నమోదు చేసిన ఇళ్లన్నీ ఉన్నతాధికారులకు పంపాం. అర్హత ఉన్న వాటన్నింటికీ నగదు జమైంది. పరిస్థితిని పరిశీలించి, సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
ప్రసాద్, హౌసింగ్ ఏఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు