దివ్యాంగులకు వాహన యోగం
విద్యావంతులైన దివ్యాంగులు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లూ ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగనున్నాయి.
విద్యావంతులకు ఉచితంగా మూడు చక్రాల బళ్లు
న్యూస్టుడే, నర్సీపట్నం, అనకాపల్లి గ్రామీణం
దివ్యాంగులు
విద్యావంతులైన దివ్యాంగులు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లూ ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇక్కట్ల నుంచి ఊరట లభించేలా వీరికి స్కూటీ తరహా మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా అందజేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
* ఉద్యోగం చేసే వారు, స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగుల్లో కొద్దిమందే మూడు చక్రాల వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. వైకల్యంతో నడవ లేని స్థితిలో ఉన్న వీరు పనులపై అటు ఇటు వెళ్లిరావడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి సకాలంలో పనులు చక్కబెట్టుకునేందుకు వీలుగా స్కూటీలను అందజేయనున్నారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దివ్యాంగులు చదువులో రాణిస్తున్నారు. అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
ఎవరు అర్హులు?: 70 శాతం వైకల్యం ఉండి, 18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్న వారు ఈ వాహనాలు పొందేందుకు అర్హులు. కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు. డిగ్రీ, పీజీ చేసిన వారి ఉద్యోగం, స్వయం ఉపాధి తదితర స్థాయిల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
152 మంది దరఖాస్తు: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ ఇప్పటికే స్కూటీలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. అనకాపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 152 మంది దరఖాస్తు చేశారు. ఉన్నతాధికారుల కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేయనుంది.
* అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల, సదరం, వైద్య సంబంధ ధ్రువపత్రాలు, పదో తరగతి మార్కుల జాబితా, వైకల్యం కనిపించేలా రెండు ఫొటోలతో హాజరుకావాలి.
* మరికొందరు స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక అవసరాలున్న వారికి చాలా కాలంగా మూడు చక్రాల సైకిళ్లు మాత్రమే ఉచితంగా లభిస్తున్నాయి. వీరిలోనూ విద్యాధికులు ఎక్కువగా ఉండటం, వారంతా దూరప్రాంతాలకు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. ఇలాంటి వారందరికీ ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో పాలకులు మూడు చక్కాల మోటారు వాహనాలను అందిస్తున్నారు.
జిల్లాకు 70 వాహనాలు: విద్యావంతులైన దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి పది చొప్పున ఏడు నియోజకవర్గాలకు 70 స్కూటీలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 18 వాహనాలు ఇప్పటికే పంపిణీ చేశారు. మొత్తం వాహనాల్లో 50 శాతం మహిళలకు కేటాయించనున్నారు. ఒక్కో వాహనం ధర రూ.94 వేలకుపైగా ఉంటుంది.
నియోజకవర్గానికి పది చొప్పున..: చదువుకుంటున్న దివ్యాంగులకు ఈ మోటారు వాహనాలతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దరఖాస్తు చేసుకున్న 152 మందికి ఈ నెల 7న అనకాపల్లిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. సంయుక్త కలెక్టర్, రవాణా సంస్థ, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం తదితర శాఖల ఉన్నతాధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. 70 మంది కంటే ఎక్కువ మంది అర్హులు ఉంటే.. వారికీ వాహనాలు అందజేయాలని ఉన్నతాధికారులను కోరతాం.
జగదీష్, సహాయ సంచాలకుడు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం