ఉప్పు, మసాలా తగ్గిస్తే.. దీర్ఘాయుష్మాన్భవ
ఎండ కారణంగా దీర్ఘకాలిక రోగులకు సైతం ఇక్కట్లు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికరక్తపోటు, మధుమేహంతో పాటు కిడ్నీ బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండ కారణంగా దీర్ఘకాలిక రోగులకు సైతం ఇక్కట్లు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికరక్తపోటు, మధుమేహంతో పాటు కిడ్నీ బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* సాధారణంగా వేసవిలో 5-6 లీటర్ల నీరు తాగాలి. ఏసీ లేదా చల్లని వాతావరణంలో ఉన్నా సరే ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. చాలా మంది కూల్డ్రింక్, జ్యూస్లు తాగుతుంటారు. వాటిలో ఎక్కువ ఫాస్పేట్ ఉండటం వల్ల శరీరంలోని నీటిని గ్రహించి మరింత డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. ముఖ్యంగా డయాలసిస్పై ఉన్న రోగులు జాగ్రత్తలు పాటించాలి.
* హీమోడయాలసిస్ రోగులు ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తపోటు పెరిగిపోయి అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి వారు కొంచెం కొంచెం రోజులో 1.5 నుంచి 2 లీటర్లు మాత్రమే నీటిని తీసుకోవాలి. ఒకసారి 200-300 మిల్లీలీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. దీనికి బదులు దాహం వేసినప్పుడు ఐస్ ముక్క నోట్లో పెట్టుకుంటే దాహం తీరిపోతుంది. ఇంటి వద్ద పెరిటోనియల్ డయాలసిస్ చేసుకునేవారు వైద్యుల సూచనలతో సాధారణంగా నీళ్లు తాగొచ్చు.
* డయాలసిస్ రోగులు ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని తినడానికి, జీర్ణం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీంతో మాటిమాటికి దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగాలని అన్పిస్తుంది. దీంతో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగి అనారోగ్యం బారిన పడుతుంటారు.
* డయాలసిస్ రోగులు మామిడి, కర్బూజ, అరటి తదితర పొటాషియం అధికంగా ఉండే పండ్లు కూడా తినకూడదు. దీనివల్ల కిడ్నీలపై భారం పడుతుంది. ఆపిల్, బొప్పాయి లాంటి పొటాషియం లేని పండ్లను తగిన మోతాదులో తీసుకోవచ్చు.
* ఎక్కువగా చల్లటి వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలి. మధ్య మధ్యలో చల్లటి వస్త్రంతో శరీరాన్ని తడుపుకొంటూ ఉంటే మాటిమాటికి దాహం వేయదు. వీరు భోజనం చేస్తూ నీళ్లు తాగకూడదు. చివరిలో మాత్రమే తాగాలి. ఆ సమయంలోనే ఔషధాలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ వైఫల్య బాధితులు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. చల్లని ప్రదేశంలో నీడపాటున ఉండేటట్లు చూసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం