మొన్న వైకాపా... నేడు తెదేపా
చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు.
కోటేశ్వరరావు, ఆయన తల్లితో ధర్మశ్రీ
కోటేశ్వరరావుకు తెదేపా కండువా కప్పుతున్న రాజు
చోడవరం, న్యూస్టుడే: చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు. తటస్థులుగా ఉన్నవారిని స్వయంగా కలిసి తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. గోవాడ చక్కెర కర్మాగారం మాజీ ఛైర్మన్, చోడవరం మాజీ సర్పంచి దివంగత సకురు పెంటారావు పట్టణవాసులకు సుపరిచితులు. ఆయన కుమారుడు కోటేశ్వరరావు సామాజిక కార్యకర్త. 2019 ఎన్నికల్లో ఈయన వైకాపా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత పెంటారావు కుటుంబాన్ని అధికార పార్టీ పక్కన పెట్టింది. మళ్లీ ఎన్నికలు రావడంతో వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ రెండు రోజుల కింద కోటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన భార్య, కుమారుడితో కలిసి ముచ్చటించారు. ఆ వెంటనే తెదేపా అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఆయన ఇంటికి వెళ్లారు. తనకు రాజకీయ గురువైన పెంటారావు కుటుంబం మద్దతు ఇవ్వాలని అభ్యర్థించి కుటుంబ సభ్యులను ఒప్పించారు. దీంతో బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో కోటేశ్వరరావుకు పార్టీ కండువా కప్పి తెదేపా తీర్థం పుచ్చుకున్నట్లు ప్రకటించారు. బుధవారం పట్టణంలో వెలమవీధికి చెందిన 12 కుటుంబాలు గూనూరు అచ్చిబాబు నేతృత్వంలో తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో గూనూరు మల్లునాయుడు, దేవరపల్లి వెంకట అప్పారావు, రొంగిలి సోమునాయుడు, అప్పలరాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్