వైకాపా నేతల బరితెగింపు
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి.
కలెక్టరేట్కు కూతవేటు దూరంలో కబ్జాల పర్వం
ఎన్నికల హంగామాలో కన్నెత్తి చూడని అధికారులు
దర్జాగా నిర్మిస్తున్న ఇళ్లు
ఈ అయిదేళ్లలో అధికార పార్టీ నేతల కన్నుపడిన సర్కారీ భూములు చేతులు మారిపోయాయి.. కొండలు కరిగిపోయాయి. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎన్నికల వేళ కూడా ఈ దందాలను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండడాన్ని చూసి ఇదే అదునుగా విలువైన కొండ పోరంబోకు, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్నారు. రూ.లక్షల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ ఎక్కడో మారుమూలన జరగడం లేదు. అనకాపల్లి కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని గ్రామాల్లో ఈ కబ్జాల పర్వం కొనసాగుతోంది. గోపాలపురం, వెంకటరమణపేటలలో మంత్రి అనుచరులు సాగిస్తున్న దందాలపై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడమే లేదు.
ఈనాడు, అనకాపల్లి
వెంకటరమణ పేటలో కొండను తవ్వేసి చేపడుతున్న అక్రమ నిర్మాణం
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. కొండను ఇష్టానుసారంగా యంత్రాలతో చదును చేసి స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఆక్రమణదారులంతా వైకాపా మద్దతుదారులు కావడంతో అధికార పార్టీ నేతలు వారికి దన్నుగా నిలుస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు చేజారిపోకుండా ప్రభుత్వ, కొండపోరంబోకు స్థలాలను ఎర చూపుతున్నారు. అలాగని పూర్తి ఉచితంగా ఏమీ స్థలాలు కట్టబెట్టడం లేదు. స్థలం విలువలో ఎంతో కొంత నేతల జేబులో పెట్టాల్సిందే. కొందరు మూడు నుంచి అయిదు సెంట్ల స్థలాలు ఆక్రమించి భారీ స్థాయిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. కొందరు దొంగపట్టాలు సృష్టించి నిర్మాణాలు చేపడుతున్నారు. సమీపంలో కొండరాయి, గ్రావెల్ను అక్రమంగా తీసుకువచ్చి పునాదుల్లో నింపేస్తున్నారు. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షల వరకు పలుకుతుండడంతో ఆక్రమణలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇదే సర్వే నంబరు 111ని ఆనుకొని తారకరామా కాలనీకి వెళ్లే రహదారిలో మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ అనుచరుడిగా చెప్పుకొంటున్న గ్రామ నాయకుడొకరు ఏకంగా వాణిజ్య సముదాయమే నిర్మిస్తున్నారు. మరికొంతమంది ఆక్రమించిన స్థలంలో పునాదులు నిర్మించి దొంగపట్టాలతో అమ్మకాలు చేస్తున్నారు. ఈ తంతు అంతా కలెక్టరేట్కు కూతవేటు దూరంలో జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అంతా ఆ బాబు కనుసన్నల్లోనే..
మంత్రి అమర్నాథ్కు కుడిభుజంగా చెప్పుకొంటున్న ఓ మండల స్థాయి నేత కనుసన్నల్లోనే ఈ ఆక్రమణల బాగోతం జరుగుతోంది. అతనే రేటు కట్టి మరీ ఆక్రమణలకు తెరతీస్తున్నారు. అతని అనుచరులు, వైకాపా మద్దతుదారులకు ప్రభుత్వ స్థలాలను రేట్లు కట్టి అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెతి చూడకుండా అతనే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేత స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అభయం ఇచ్చి ఇక్కడ స్థలాలను పంచిపెట్టేసినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. వెంకటరమణ పేటలో ఆక్రమణలపై పలుమార్లు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు స్పందనలో కలెక్టర్, జేసీకి ఫిర్యాదులు ఇచ్చారు. అయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
సర్వే నెంబరు 111లోని ప్రభుత్వ స్థలంలో వైకాపా నాయకుడు నిర్మిస్తున్న దుకాణ సముదాయం
ఆక్రమణదారులు అంతా వైకాపా సానుభూతి పరులు కావడంతో అధికారులపై మంత్రితో ఒత్తిడి తీసుకువచ్చి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుండా చక్రం తిప్పారు. ఫిర్యాదులు చేసినా రెవెన్యూ వారు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు మరింత విస్తరిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!