logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.

Updated : 18 Apr 2024 04:51 IST

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకోట పంచాయతీ చటాకంబ గ్రామానికి చెందిన సోకెల నాగరాజు(34), మామిడి రవి(21), గెమ్మెలి శివాజీ ద్విచక్రవాహనంపై బుధవారం దేవరాపల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో బైక్‌ అదుపు తప్పి వెలగలపాడు సమీపంలో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు, రవి అక్కడికక్కడే మృతి చెందారు. శివాజీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని దేవరాపల్లి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. మృతదేహాలను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మృతదేహం వద్ద వారు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. ప్రమాదం జరిగింది విజయనగరం జిల్లా పరిధిలో కాదని, మృతదేహాలకు ఇక్కడ శవపరీక్ష నిర్వహించబోమని ఎస్‌.కోట ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు రామలక్ష్మి, కో ఆప్షన్‌ సభ్యుడు మదీనా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డీవీజీ శంకరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వైద్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని