రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.
అనంతగిరి గ్రామీణం, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకోట పంచాయతీ చటాకంబ గ్రామానికి చెందిన సోకెల నాగరాజు(34), మామిడి రవి(21), గెమ్మెలి శివాజీ ద్విచక్రవాహనంపై బుధవారం దేవరాపల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి వెలగలపాడు సమీపంలో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు, రవి అక్కడికక్కడే మృతి చెందారు. శివాజీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని దేవరాపల్లి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. మృతదేహాలను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మృతదేహం వద్ద వారు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. ప్రమాదం జరిగింది విజయనగరం జిల్లా పరిధిలో కాదని, మృతదేహాలకు ఇక్కడ శవపరీక్ష నిర్వహించబోమని ఎస్.కోట ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఎస్టీ కమిషన్ సభ్యురాలు రామలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు మదీనా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వైద్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జగన్ని ఇంటికి పంపిద్దాం
[ 01-05-2024]
కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ అన్నారు. -
వైకాపా పాలనలో మహిళలపై పెరిగిన అకృత్యాలు
[ 01-05-2024]
వైకాపా పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణా తెదేపా నాయకులు, స్టార్ కాంపెయినర్ నర్సిరెడ్డి తెలిపారు. -
ప్రజల ఆస్తులను దోచుకోవడానికే జగనన్న భూ యాజమాన్య చట్టం
[ 01-05-2024]
ప్రజల సొంత ఆస్తులను దోచుకోడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. -
కార్మికులపై జగన్ కాఠిన్యం
[ 01-05-2024]
వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు. -
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల జమ
[ 01-05-2024]
ఎన్నికల నియమావళికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్ నెలల్లో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత మంగళవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర