ప్రత్యామ్నాయం..ఆరు తడి వైపు పయనం
ఈ రబీలో ప్రభుత్వం వరిపంటకు అవకాశం ఇవ్వకపోవడంతో రైతులందరూ ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపారు. అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆయా భూములకు అనువైన పంటలు సాగు చేసేదిశగా అన్నదాతలు చర్యలు
పెరిగిన మినుము విస్తీర్ణం
పెడన మండలం చేవెండ్రపాలెంలో సాగైన మినుము పంట
గొడుగుపేట (మచిలీపట్నం), న్యూస్టుడే : ఈ రబీలో ప్రభుత్వం వరిపంటకు అవకాశం ఇవ్వకపోవడంతో రైతులందరూ ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపారు. అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆయా భూములకు అనువైన పంటలు సాగు చేసేదిశగా అన్నదాతలు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఇతర పంటల విస్తీర్ణం పెరుగుతోంది.
వరికి బదులు అపరాలు
జిల్లాలో గత రబీలో మచిలీపట్నం, పెడన, కైకలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలతోపాటు విజయవాడ రూరల్, ఉయ్యూరు, తదితర ప్రాంతాల్లో బోర్ల కింద వరి పంట సాగు చేశారు. అలా మొత్తం 72వేల హెక్టార్ల వరకు వరి పంట సాగయ్యింది. ఈఏడాది తూర్పు, పశ్చిమకృష్ణాలోని ప్రాంతాల్లో ఎక్కువ శాతం వరి విస్తీర్ణాన్ని మినుము పంట భర్తీ చేసింది. గతేడాది జనవరి 12వ తేదీ నాటికి 1.04లక్షల హెక్టార్లలో వినుము పంట సాగైతే ఈ ఏడాది అదే సమయానికి 1.29లక్షల హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 25లక్షల హెక్టార్లు పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ రూరల్, పెనమలూరు, కంకిపాడు, మైలవరం, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తదితర మండలాల్లో కలిపి ఇప్పటివరకు 1300హెక్టార్లకుపైగా వరి సాగు అయ్యింది.
వివిధ రకాల పంటల సాగు
మొక్కజొన్న గత రబీతో పోల్చితే ఇప్పటికే 4వేల హెక్టార్లకుపైగా ఎక్కువ సాగయ్యింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి మండలాల్లో వేరుసెనగ పంట విస్తీర్ణం పెరిగింది. మండవల్లి, ముదినేపల్లి, బాపులపాడు, రెడ్డిగూడెం, వత్సవాయి తదితర మండలాల్లోని గరపనేలల్లో రైతులు వేరుసెనగపంట సాగు చేశారు. ఈసారి రైతులు విభిన్న పంటలవైపు ఆసక్తి చూపారు. బంటుమిల్లి, మండవల్లి, ముదినేపల్లి, కైకలూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉలవ, ఇబ్రహీంపట్నం, వీరులపాడు, కంచికచర్ల, జగ్గయ్యపేట, గన్నవరం మండలాల్లో శనగలు, నందివాడతోపాటు వివిధ మండలాల్లోని పలుగ్రామాల్లో ఆవాల పంట వేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఆరుతడి పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు కొత్త పంటల వైపు కూడా అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.
మరింత పెరిగే అవకాశం
గత రబీతో పోల్చితే ప్రస్తుత సమయానికి 30వేల హెక్టార్ల ఆరుతడి పంటల విస్తీర్ణం పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఎక్కువ మంది మినుము సాగు చేశారు. ఇంకా కొంత నమోదు చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయితే మినుము విస్తీర్ణం ఇంకా పెరుగుతుంది. రైతులు ఇతర పంటలు కూడా సాగు చేయడంతోపాటు అన్నింటినీ ఈ పంటలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. సాగులో సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను ప్రోత్సహించే దిశగా అన్నివిధాలుగా కృషి చేస్తున్నాం. - మోహనరావు, వ్యవసాయశాఖ జేడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి