అత్యుత్సాహం.. అభాసుపాలు
నగరపాలక సంస్థ కార్యదర్శి విభాగం అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ చట్టాలకు భిన్నంగా సొంత నిర్ణయాలు సభ్యుల ముందుకు తెస్తున్నారు. అధికార, విపక్షాల సభ్యుల హక్కులను, బాధ్యతలను హరించేలా వ్యవహరిస్తున్నారు.కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ప్రిసైడింగ్
విజయవాడ కార్పొరేషన్ అధికారుల తీరిదీ..
నగరపాలక సంస్థ కౌన్సిల్, స్థాయీ సంఘం సమావేశాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ప్రశ్నలు, ఆఫీసు ప్రియాంబుల్స్ను సమర్పించే ముందు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, శాఖాధికారులు.. మేయర్ ఆమోదం(సంతకం) పొందిన తర్వాత మాత్రమే సెక్రటరీ సెల్కు పంపాలి.
- కార్యదర్శి సర్క్యులర్ (ఈ నెల 3న)
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల ప్రతిపాదనలు, ప్రశ్నలపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శికి సెక్రటరీసెల్ కార్యకలాపాలపై అవగాహన లేక జారీచేసిన ఉత్తర్వులసను తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం.
- సెక్రటరీ ఇన్ఛార్జి (ఈ నెల 6న)
నగరపాలక సంస్థ కార్యదర్శి విభాగం అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ చట్టాలకు భిన్నంగా సొంత నిర్ణయాలు సభ్యుల ముందుకు తెస్తున్నారు. అధికార, విపక్షాల సభ్యుల హక్కులను, బాధ్యతలను హరించేలా వ్యవహరిస్తున్నారు.
కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ప్రిసైడింగ్ అథారిటీగా వ్యవహరించే మేయర్కు... చట్టం కల్పించిన అధికారులకు భిన్నంగా అత్యుత్సాహంతో ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆపై అసలు విషయం తెలుసుకుని తూచ్ అంటున్నారు. ఈ నెలలో కార్యదర్శి విభాగం అధికారులు జారీచేసిన రెండు వేర్వేరు సర్క్యులర్లలో కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి పొందిపర్చిన పలు అంశాలు అధికారుల అవగాహనా రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
కార్పొరేషన్లోని కొందరు అధికారులు... మేయర్తోపాటు, పాలకపక్షాన్ని ఆకర్షించేందుకు, వారి మెప్పు పొందేందుకు అటువంటి అసంబంధమైన అంశాలను తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు 1955 జీహెచ్ఎంసి యాక్టుతోపాటు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1981(యాక్టు నెంబరు-23)ను అనుసరిస్తున్నారు. దాని ఆధారంగానే ప్రతిపాదనలు రూపొందించడం దగ్గర నుంచి తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపడం, ఆపై కమిషనర్ ద్వారా వాటిని అమలయ్యేలా చూడడం వంటి చేస్తూ వస్తున్నారు.
సభ్యులు ప్రియాంబుల్ రూపంలో ముందుగా అందించిన సమస్యలు, అభివృద్ధి అంశాల ప్రతిపాదలను కార్యదర్శి విభాగం అధికారులు మేయర్ ముందుంచాలి. నిబంధనలకు అనువుగా అవి ఉన్నాయో, లేవో వివరిస్తూ ఆపై ఆయా ప్రతిపాదనలను కౌన్సిల్ అజెండాలో చేర్చేందుకు సహకరించాల్సి ఉంది.
చిన్నపాటి సమస్యలైతే..
సాధారణ, చిన్నపాటి సమస్యలతో కూడిన ప్రతిపాదిత అంశాలేమైనా కౌన్సిల్ సభ్యులు ప్రియాంబుల్ రూపంలో అందించినా, వాటిని తిరస్కరిస్తే దానికి కారణాలు పేర్కొంటూ, మేయర్ సంతకంతో లిఖితపూర్వంగా వారికి తెలియజేయాలి. అటువంటి చిన్నపాటి సమస్యలను నేరుగా కమిషనర్ ఆమోదంతో పరిష్కరించుకునే వీలున్నందున, వాటిని చర్చకు తావులేకుండా చేసే అవకాశం అధికారం ఉంటుంది. అందుకు భిన్నంగా మేయర్ ఆమోదం, సంతకం లేనిదే కార్పొరేటర్లు ప్రతిపాదనలు, ప్రశ్నలు పంపడానికి వీలు లేదని 7 అంశాలతో కూడిన సర్క్యులర్ను కార్యదర్శి విభాగం అధికారులు జారీ చేసిన సర్క్యులర్ ప్రస్తుతం మేయర్తోపాటు, పాలకపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాయి.
అవగాహన ఏదీ?
నగరపాలక సంస్థలో చాలా కాలంగా పలు విభాగాల అధికారులే ఇన్ఛార్జి సెక్రటరీలు(కార్యదర్శులు)గా కొనసాగుతూ వస్తున్నారు. ఇక్కడ గుమాస్తాలుగా పనిచేసి, ఆపై ఇతర ప్రాంతాల్లోని పలు గ్రేడ్ల పురపాలక సంఘాల్లో కమిషనర్లుగా పనిచేసి తిరిగి నగరపాలక సంస్థకు బదిలీపై వచ్చిన వారికి సెక్రటరీ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. వారికి చట్టంపై సరైన అవగాహన లేకపోవడంతో పాలకులు, మేయర్ మెప్పుకోసం సభ్యుల హక్కులను హరించే విధంగా సర్క్యులర్లు జారీ చేస్తూ స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం