అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు.
విద్యార్థులకు అందని విద్యాదీవెన నిధులు
‘విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అయితే ఆచరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈపథకం కింద నిధులు ఎన్ని నెలలకు ఎప్పుడు జమ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.’
సంయుక్త ఖాతా తెరిచేందుకు బ్యాంకులో బారులు తీరిన విద్యార్థులు, తల్లిదండ్రులు (పాత చిత్రం)
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: మచిలీపట్నంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు ఆ కళాశాల విద్యార్ధి హాల్టికెట్ కోసమని కళాశాలకు వెళ్లి అడిగాడు. విద్యాదీవెన డబ్బులు పడలేదు .. రుసుము చెల్లిస్తేనే హాల్టికెట్ ఇస్తామని కళాశాల ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆ విద్యార్థి తన తండ్రికి చెప్పగా ఆయన కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించి తానే రెండురోజుల్లో చెల్లిస్తానని సహకరించాలని కోరగా హాల్టికెట్ ఇచ్చారు.
ఇది ఒక విద్యార్ధి సమస్య మాత్రమే కాదు బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని వందలాదిమంది డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు విద్యాదీవెన సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా పిల్లలను చదివించుకోవచ్చని పేదకుటుంబాలకు చెందిన వారు కూడా అనేక కష్టాలకోర్చి కళాశాలల్లో చేర్పించారు. ప్రస్తుతం సాయం అందక పోవడంతో వారంతా అప్పులు చేసి కళాశాలలకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
ఆది నుంచీ అవస్థలే: విద్యాదీవెన డబ్బులు సకాలంలో జమకాకపోవడంతో కొన్ని సార్లు తల్లిదండ్రులే ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా అనేక ఇబ్బందులు పడుతుంటే ఎన్నికలు సమీపించడంతో పథకంలో పలు మార్పులు చేశారు. మొదట్లో ప్రభుత్వం బోధన రుసుములను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేది. గతేడాది చివరిలో విద్యార్థులు వారి తల్లులతో బ్యాంకులో సంయుక్త ఖాతాలు తెరవాలనే నిబంధన విధించారు. సంయుక్త ఖాతాల్లో మాత్రమే రుసుము జమ చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల కూడ విమర్శలు వ్యక్తమయ్యాయి.
బటన్ నొక్కినా ఫలితం లేదు
జిల్లా వ్యాప్తంగా బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులు మొత్తం 31,966మంది విద్యార్థులు విద్యాదీవెన పథకంలో లబ్ధిపొందుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని 15 కళాశాలల్లో వేలాదిమంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. వీరిలో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యాదీవెన నిధులు కేవలం 20శాతం మందికి మాత్రమే జమ అయ్యాయని, 80శాతం మందికి అందలేదని కళాశాలల యాజమాన్యాలే చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి ఒకటిన పామర్రులో ముఖ్యమంత్రి జగన్ విద్యాదీవెన బటన్ నొక్కి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఫీజు డబ్బులు మాత్రం ఖాతాలకు చేరలేదు.
విద్యావ్యవస్థ నిర్వీర్యం
వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది. గత ఎన్నికల్లో అన్న వస్తున్నాడు..మంచి రోజులు వస్తున్నాయి..కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికొదిలేశారు. విద్యాదీవెన, వసతి దీవెన నిధులను కూడా పక్కదారి పట్టించారు.
మాదిరెడ్డి సుబ్రహ్మణ్యం, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ స్టేట్ కన్వీనర్
ఓట్లు దండుకునేందుకే..
ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. విద్యార్థుల ఓట్లు దండుకునే ప్రయత్నాలు తప్ప ప్రభుత్వం వారికి చేసిందేమి లేదు.
బొడ్డు వంశీకృష్ణ, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 05-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ !
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. -
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న