వణికిస్తున్న వాయుగుండం
ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో అన్నదాత వెన్నులో మరోసారి వణుకు మొదలైంది.
ఆందోళనలో అన్నదాతలు
కుప్పపై పరదా కప్పుతున్న రైతు
న్యూస్టుడే, తోట్లవల్లూరు: ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో అన్నదాత వెన్నులో మరోసారి వణుకు మొదలైంది. ఉన్నట్టుండి సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. దీనికి తోడు చల్లని గాలులు తోడవడంతో పంట నేల వాలుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డెల్టాలో చాలా చోట్ల వరి పంట కోశారు. మరికొన్ని చోట్ల యంత్రాలతో కోసి పరదాలపై వడ్లు ఆరబోశారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదొడుకులకు గురైనా బాగా పండింది. పంట చేతికొచ్చి తమ కష్టాలు తీరతాయని రైతులు భావించారు. ప్రస్తుతం పొంచి ఉన్న వాయుగుండం ముప్పు తమ ఆశలపై నీళ్లు చల్లిందని అన్నదాతలు కలత చెందుతున్నారు.
జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ వరి సాగు చేశారు. ఎకరాకు 30 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. పలు మండలాల్లో 35 శాతం వరకు పంట కోసి పొలాల్లో పనలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే ఎకరాకు రూ.45 వేల వరకు పెట్టుబడితోపాటు ఆరుగాలం శ్రమ నీటి పాలవుతుందని భయాందోళన చెందుతున్నారు.
* కోస్తాలో సాధారణంగా ఏటా అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో తుపానులు సంభవిస్తుంటాయి. నాలుగేళ్లుగా ఇదే సమయంలో రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. దీంతో వరి రైతులకు నవంబరు, డిసెంబరు నెలలంటేనే భయం పట్టుకుంది.
కోతలు వాయిదా వేసుకోవాలి.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరికలు జారిచేసిందని తోట్లవల్లూరు మండల వ్యవసాయాధికారి జి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ తుపాను ప్రభావం ఉండొచ్చన్నారు. రైతులందరూ వరి కోతలు డిసెంబరు 10వ తేదీ వరకు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు.
రంగు మారకుండా ఇలా చేయండి
వర్షాల వల్ల వరి పైరు వాలిపోకుండా ఎక్కడికక్కడ నాలుగైదు దుబ్బుల తలలను కలిపి దగ్గరకు చేర్చి కట్టుకోవాలి. భారీ వర్షాలు కురిస్తే 100 లీటర్ల నీటిలో 2 కిలోల కళ్లు ఉప్పును కలిపి కట్టగా కట్టుకున్న పంటతోపాటు ఓదెల మీదున్న వరి పూర్తిగా తడిసేలా పిచికారీ చేస్తే ధాన్యం రంగు మారకుండా నిరోధించవచ్చు. వర్షం నీరు పొలంలో నిలిచిపోకుండా చిన్న కాలువలు తీసి, గట్లకు గళ్లు పెట్టుకుని బయటకు పోయే విధంగా అమర్చుకోవాలి.
జి.నాగేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి, తోట్లవల్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం