logo

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది.

Published : 28 Mar 2024 05:42 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. 900 గ్రాముల బంగారం, 7.820 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. 3833 యూఎస్‌ఏ, 30 ఆస్ట్రేలియా, 138 సింగపూర్‌ డాలర్లు, 20 యూకే పౌండ్లు, 135 యూరోలు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. దుర్గమ్మను నేరుగా దర్శించుకోలేని భక్తులు ఆన్‌లైన్లో ఇ-హుండీ ద్వారా రూ.1,22,800 సమర్పించినట్లు ఈవో రామారావు తెలిపారు. లెక్కింపును వన్‌టౌన్‌ పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని